News March 12, 2025
జగిత్యాల: తాజా మాజీ సర్పంచుల ముందస్తు అరెస్ట్

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సర్పంచులకు రావలసిన పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంతో అసెంబ్లీ ముట్టడిస్తారని ఉద్దేశంతో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో తాజా మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తమకు రావలసిన బకాయి బిల్లులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమకు బిల్లులు చెల్లించే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని సర్పంచులు హెచ్చరించారు.
Similar News
News March 26, 2026
NGKL: జీవన్ రెడ్డి పార్టీ విడిపోవడం బాధాకరం: ఎంపీ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ విడిపోవడం ఎంతో బాధాకరమని నాగర్కర్నూల్ డాక్టర్ మల్లు రవి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో కొనసాగి అడగాలి తప్ప పార్టీ మారడం సరైనది కాదని అన్నారు. కొన్ని రాజకీయ సమీకరణల వల్ల అందరికీ పదవులు రావని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప సిద్ధాంతాలు ఉన్న పార్టీ అని గుర్తు చేశారు. ఇలాంటి పార్టీ దేశంలో ఇంకొకటి లేదన్నారు.
News March 26, 2026
గంగవరం: బైక్లు ఢీకొని వ్యక్తి మృతి

రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన గంగవరం మండలంలో జరిగింది. ఓ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు జుబేర్, శ్రీధర్ బైక్పై పలమనేరుకు బయలుదేరారు. మేలుమయి గ్రామానికి చెందిన దొరస్వామి (55) పలమనేరు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మేలు మయి క్రాస్ వద్ద వీరి వాహనాలు ఢీకొన్నాయి. సీఎంసీకి తరలిస్తుండగా దొరసామి మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 26, 2026
పెట్రోల్ సమస్య.. వారికి వర్క్ ఫ్రమ్ హోమ్!

హైదరాబాద్లో పెట్రోల్ సమస్యతో కొన్ని IT కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మొదలుపెట్టాయి. విప్రో, యాక్సెంచర్, TCS వంటి పెద్ద కంపెనీలు ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని కల్పిస్తుండగా, మరికొన్ని సంస్థలు 50-50 విధానం తీసుకొచ్చాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉంది. HYDలో దాదాపు 9.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా అందులో సగం మంది బైకులు, కార్లలో రాకపోకలు సాగిస్తారని సమాచారం.


