News March 12, 2025

‘ప్రశక్తి’ అవార్డుకు నార్నూర్ ఎంపిక

image

దేశ రాజధాని ఢిల్లీ నుంచి DAPRG అదనపు కార్యదర్శులు కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ బ్లాక్‌లలో అమలు చేసిన చర్యలు, ముఖ్య విజయాలను స్క్రీనింగ్ కమిటీకి కలెక్టర్ సమర్పించారు. దీంతో నార్నూర్ బ్లాక్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం కేటగిరిలో ప్రధానమంత్రి ‘ప్రశక్తి’ అవార్డు-2024 రెండో రౌండుకు ఎంపికైందన్నారు.

Similar News

News September 13, 2025

ADB: డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు

image

ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్లకు చివరి అవకాశం కల్పించినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్ ప్రిన్సిపల్ డాక్టర్ జె.సంగీత పేర్కొన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో కళాశాలలో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్ ఉర్దూ మీడియంలో 17, ఇంగ్లీష్ మీడియంలో 49, తెలుగు మీడియంలో 56, ఫిజికల్ సైన్సెస్‌లో 20 సీట్లు ఉన్నట్లు తెలిపారు.

News September 12, 2025

ADB: ‘ఎన్నికల హామీ ప్రకారం వేతనాలు చెల్లించాలి’

image

మధ్యాహ్న భోజన పథకం బిల్లుల నిర్వహణను యుకుబేర్ నుంచి మినహాయించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న అన్నారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్ సీఐటీయూ ఆఫీస్‌లో మాట్లాడారు. కార్మికుల పెండింగ్ బిల్లులతోపాటు వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం కార్మికులకు పదివేల వేతనం అమలు చేయాలని పేర్కొన్నారు.

News September 12, 2025

ADB: ‘అంగన్వాడీలో సౌకర్యాలు ఉండేలా చూడాలి’

image

ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు. అంగన్‌వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాల ప్రాముఖ్యతపై చర్చించారు. అంగన్‌వాడీ భవనాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి అవసరమైన సౌకర్యాలు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.