News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. జనగామ జిల్లా ఎదురుచూస్తోంది!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జనగామ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. పాలకుర్తికి 100 పడకల ఆసుపత్రి, జిల్లాలో పెద్ద మొత్తంలో ఇండస్ట్రియల్ పర్క్స్, ఘనపూర్కు 100 పడకల ఆసుపత్రి, ముఖ్యంగా పాలకుర్తిలో డిగ్రీ కాలేజ్, చెన్నూరు రిజర్వాయర్ పూర్తి చేసి దిగువ ప్రాంతాలను సాగు, తాగు నీరు అందించాలని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
Similar News
News December 28, 2025
ఈ ఏడాది 57 పోక్సో కేసులు నమోదు: VZM ఎస్పీ

విజయనగరం జిల్లాలో పోక్సో కేసులు గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. 2024లో 58 కేసులు నమోదుకాగా.. 2025లో 57 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రాసిక్యూషన్ వేగవంతం చేయడంతో నిందితులకు కఠిన శిక్షలు ఖరారయ్యాయన్నారు. ఒక కేసులో యావజ్జీవ కారాగార శిక్ష, 2 కేసుల్లో 25 సంవత్సరాలకు పైగా, 11 కేసుల్లో 20 సంవత్సరాలకు పైగా జైలు శిక్షలు విధించబడ్డాయని వివరించారు.
News December 28, 2025
2025లో కడప జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాలు ఇవే.!

☛ ఉద్రిక్తతల నడుమ గోపవరం ఉప సర్పంచ్ ఉప ఎన్నికలో YCP విజయం
☛ పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలో TDP విజయం
☛ కూటమి నేతలకు పదవులు
☛ కడప మేయర్గా సురేశ్ బాబు తొలగింపు.. తర్వాతి ఎన్నికలో పాక సురేశ్ ఎన్నిక
☛ కడప జిల్లా TDP అధ్యక్షుడిగా భూపేశ్ రెడ్డి నియామకం
☛ కడప జిల్లాలో మహానాడు నిర్వహణ
☛ జమ్మలమడుగు YCP ఇన్ఛార్జ్గా రామసుబ్బారెడ్డి నియామకం
☛ ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ బకాయిలపై దీక్షలు.
News December 28, 2025
యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్న మంత్రి కోమటిరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం యాదాద్రి, నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు వలిగొండలో నూతన రోడ్డును ప్రారంభించి, అనంతరం సుంకిశాల ఆలయాన్ని సందర్శిస్తారు. వలిగొండలో సర్పంచుల సన్మాన సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు మాడుగులపల్లిలో కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నల్గొండలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.


