News March 12, 2025

NRPT: తెలంగాణ బడ్జెట్.. జిల్లాకు ఏమి కావాలంటే.?

image

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయాయి. ఈ నేపథ్యంలో NRPT జిల్లాకు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. 69జీవోను పాత డీపీఆర్ ప్రకారం రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటు, రోడ్ల మరమ్మత్తులకు నిధులు, జూనియర్ కళాశాల ఏర్పాటుకు నిధులు, వాగులపై చెక్ డ్యాముల నిర్మాణం, కొత్తగా బస్టాండ్ నిర్మించాలని కోరుతున్నారు.

Similar News

News March 27, 2026

నేటి నుంచి విజయవాడలో ఐజేయూ జాతీయ ప్లీనరీ

image

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ 11వ జాతీయ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెుల 27, 28, 29న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ సదస్సు జరగనుంది. 27 రాష్ట్రాల నుంచి సుమారు 350 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. 28న సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు ఈ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. జర్నలిస్టుల హక్కుల గురించి ఈ ప్లీనరీలో ప్రధానంగా చర్చించనున్నారు.

News March 27, 2026

IPL 2026 ఓపెనింగ్ సెరిమనీ రద్దు!

image

ఈ ఏడాది IPL ఓపెనింగ్ సెరిమనీ ఉండదు. గతేడాది జూన్ 4న బెంగళూరు స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన వారికి గుర్తుగా ఈసారి వేడుకలు నిర్వహించొద్దని BCCI నిర్ణయించింది. అందుకే శనివారం జరిగే ఫస్ట్ మ్యాచ్ ముందు ఎలాంటి సెలబ్రేషన్స్ చేయట్లేదు. అయితే మే 31న జరిగే ఫైనల్ రోజు మాత్రం గ్రాండ్ క్లోజింగ్ సెరిమనీ ప్లాన్ చేస్తున్నారు.

News March 27, 2026

పెద్దపల్లి: మే 11 నుంచి జనగణన 2027 ప్రారంభం: కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జనగణన 2027 హౌస్ లిస్టింగ్ సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా నిజమైన సమాచారం అందించాలని, తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. సిబ్బందికి డేటా సేకరణ, డిజిటల్ పరికరాల వినియోగం, ఫీల్డ్ జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. జనగణన మే 11 నుంచి ప్రారంభమై భవిష్యత్ సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం ఖచ్చిత గణాంకాలు సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు.