News March 12, 2025
దేవాదాయ శాఖలోకి కాశీనాయన ఆశ్రమం..?

కాశీనాయన ఆశ్రమంలో కూల్చివేతలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ‘ఆశ్రమం అటవీ ప్రాంతంలో ఉంది. అటవీ శాఖ నిబంధనలు సంక్లిష్టంగా ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఆ శాఖ అధికారులు నిర్మాణాలను కూల్చివేశారు. కాశీనాయన ఆశ్రమాన్ని దేవాదాయ శాఖలోకి తీసుకోవాలని ఆదినారాయణ రెడ్డితో పాటు ఇతర MLAల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. సీఎంతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటాం’ అని ఆనం ప్రకటించారు.
Similar News
News March 26, 2026
ఫుట్బాల్ టీంకు ఏడుగురు జిల్లా పోలీసుల ప్రాతినిధ్యం

తెలంగాణలో జరగనున్న 74వ బీఎన్ ముల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్ షిప్-2026 పోటీలకు ఏపీ పోలీస్ జట్టుకు జిల్లాకు చెందిన ఏడుగురు పోలీసులు ప్రాతినిధ్యం వహించారు. ఎన్. నాగేంద్ర (డీఏఆర్), కె. బాబు (జీపీఆర్), బి.సిద్దారెడ్డి (డీఏఆర్), ఎస్.ఇమామ్ ఖాసిం (ఆర్ ఎస్ఐ) తిరుపతి (ఎర్రగుంట్ల), ఎల్.సతీష్బాబు (ట్రాఫిక్, కడప), జి.రాజశేఖర్ (డి.ఎ.ఆర్), ఎస్.శివ సుబ్రమణ్యం (డి.ఎ.ఆర్) ఉన్నారు.
News March 26, 2026
కడప జిల్లా వ్యాప్తంగా 325 కేసులు నమోదు

కడప జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని 325 మందికి రూ.74,025 జరిమానా విధించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనాలలో ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.
News March 26, 2026
కడప జిల్లా వ్యాప్తంగా 325 కేసులు నమోదు

కడప జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని 325 మందికి రూ.74,025 జరిమానా విధించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనాలలో ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.


