News March 12, 2025
సీఐడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి

AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్ట్ వ్యవహారంలో విచారణకు రావాలని ఆయనకు సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్రమంగా పోర్ట్ వాటాలు బదిలీ చేయించుకున్నారని VSRపై కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Similar News
News March 12, 2025
జగన్తో తమిళనాడు మినిస్టర్ భేటీ

AP: మాజీ సీఎం వైఎస్ జగన్తో తమిళనాడు మంత్రి ఈవీ వేలు, ఎంపీ విల్సన్ తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఈ నెల 22న చెన్నైలో జరిగే దక్షిణ భారత అఖిలపక్ష నేతల సమావేశానికి హాజరుకావాలని జగన్ను కోరారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ రాసిన లేఖను ఆయనకు అందజేశారు. డీలిమిటేషన్ అంశంపై చర్చించేందుకు పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలను స్టాలిన్ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
News March 12, 2025
నిలిచిన SBI లావాదేవీలు.. కస్టమర్ల అసహనం

దేశ వ్యాప్తంగా SBI ఆన్లైన్ సేవలు బంద్ అయ్యాయి. UPI యాప్లో SBI అకౌంట్ నుంచి చేస్తున్న లావాదేవీలు నిలిచిపోయాయి. అలాగే SBI అకౌంట్ ఉన్న వారికి చేస్తున్న లావాదేవీలు సైతం ఫెయిల్ అవుతున్నాయి. నిన్న కూడా ఇలాంటి సమస్యే తలెత్తి యూజర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇవాళ కూడా మళ్లీ అదే తరహా సమస్య రావడంతో దేశంలో అతిపెద్ద బ్యాంక్పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీకూ ఇలాంటి సమస్యే ఎదురైందా? కామెంట్ చేయండి.
News March 12, 2025
చనిపోయిందనుకొని ఖననం చేస్తే.. చివరికి.!

మరణించిందని భావించి పూడ్చిపెట్టిన మహిళ తిరిగి లేచిన ఘటన USలో జరిగింది. 1915లో ఎస్సీ విలియమ్స్ మూర్ఛ వ్యాధితో చనిపోయిందనుకొని అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. అయితే, అంత్యక్రియలకు ఆలస్యంగా వచ్చిన తన సోదరి చివరి చూపు చూస్తానని శవపేటికను తెరవాలని కోరారు. దీంతో తవ్వి పేటిక తెరవగా ఆమె లేచి కూర్చొని నవ్వుతూ కనిపించారు. అది చూసిన వారంతా భయంతో పారిపోయారు. ఆ తర్వాత ఆమె మరో 47ఏళ్లు జీవించడం గమనార్హం.