News March 12, 2025

NGKL: మహిళ ఆత్మహత్య.. వ్యక్తి అరెస్ట్.!

image

అచ్చంపేట పట్టణంలో ఈనెల 6న చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిన ఆవుల లక్ష్మి (37) కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. మృతురాలి తండ్రి మేకల నిరంజన్ ఫిర్యాదు మేరకు పట్టణానికి చెందిన బుద్దుల పర్వతాలు అనే వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం అచ్చంపేట కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు తెలిపారు.

Similar News

News March 13, 2025

సిద్దిపేట: టీజీఐఐసీ భూముల సేకరణపై కలెక్టర్ సమీక్ష

image

సిద్దిపేట కలెక్టరేట్లో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGIIC) వారికీ కేటాయించిన భూముల భూసేకరణ ప్రక్రియ గురించి జిల్లా టీజీఐఐసీ, రెవెన్యూ, సర్వే అధికారులతో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి కలెక్టర్ ఎం.మను చౌదరి సమీక్ష నిర్వహించారు. టీజీఐఐసీకి కేటాయించిన భూముల భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

News March 13, 2025

BREAKING: పోసానికి బిగ్ షాక్

image

AP: నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయనకు గుంటూరు కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. నిన్నటివరకు నాలుగు కేసుల్లో బెయిల్ వచ్చిన పోసాని త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని అంతా భావించగా, ఊహించని విధంగా మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

News March 13, 2025

ఒక్కో మ్యాచ్‌కు రూ.3,110 ఫీజు: ఆటగాళ్లకు PCB షాక్

image

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించి తీవ్ర నష్టాల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టీ20 కప్‌లో పాల్గొనే దేశవాళీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను భారీగా కుదించింది. గతంలో ఒక్కో మ్యాచ్‌కు 40 వేల పాకిస్థానీ రూపాయలు (భారత కరెన్సీలో రూ.12 వేలు) ఇచ్చేది. ఇప్పుడు దానిని 10 వేలకు (భారత కరెన్సీలో రూ.3,110) తగ్గించింది. అలాగే చీప్ హోటళ్లలో బస, విమాన ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించింది.

error: Content is protected !!