News March 12, 2025

BREAKING: KCRను కలిసిన పటాన్‌చెరు MLA

image

తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం ఈరోజు జరిగింది. అసెంబ్లీకి వచ్చిన BRS అధినేత KCRను పటాన్‌చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. తన తమ్ముడి కుమారుడి పెళ్లికార్డును KCRకు ఇచ్చి ఆహ్వానించారు. కొన్ని నెలల క్రితం ఆయన BRSను వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానూ మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన KCRను కలవడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది.

Similar News

News March 12, 2025

HYD: భూగర్భజలాలను తోడేస్తున్నారు!

image

నగర శివారులో భూగర్భజలాలు తగ్గడంతో వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి సమయంలో శంకర్‌పల్లి, జన్వాడ, పూర్ణనంద ఆశ్రమం రోడ్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో బోర్లువేసి కొందరు నీటిని తోడేస్తున్నారు. దీనివలన ఆయా ప్రాంతాల్లో లో ప్రెషర్ సమస్యలతో‌ ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, వట్టినాగులపల్లి, ఖానాపూర్ గ్రామాల్లో ఏకంగా 25 బోర్లను అధికారులు సీజ్ చేశారు.

News March 12, 2025

నిలిచిన లావాదేవీలు.. స్పందించిన SBI

image

తమ బ్యాంక్ లావాదేవీలు ఫెయిల్ కావడంపై దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ SBI స్పందించింది. ‘SBI యూపీఐ లావాదేవీల్లో సాంకేతిక సమస్య ఎదురైంది. దీని కారణంగా కస్టమర్ల లావాదేవీలు ఫెయిల్ అవుతున్నాయి. దీన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఖాతాదారులు UPI లైట్ లావాదేవీలు వినియోగించుకోవచ్చు’ అని వెల్లడించింది. అటు తమ లావాదేవీలూ ఫెయిల్ అయ్యాయని, డబ్బులు కట్ అయ్యి ప్రాసెసింగ్‌లో పడ్డాయని యూజర్లు పోస్టులు పెడుతున్నారు.

News March 12, 2025

అల్లూరి జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 230 మంది గైర్హాజర్

image

అల్లూరి జిల్లాలో 26పరీక్ష కేంద్రాల్లో సీనియర్ ఇంటర్మీడియేట్ ఫిజిక్స్, ఎకనామిక్స్ జనరల్ పరీక్షలు జరిగాయని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి అప్పలరాం తెలిపారు. జనరల్ పరీక్షలకు మొత్తం 5477మంది హాజరు కావలసి ఉండగా 5330మంది హాజరు అయ్యారని, 147మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. ఒకేషనల్ పరీక్షలకు 1211మందికి 1128మంది రాశారని, 83మంది గైర్హాజర్ అయ్యారని తెలిపారు.

error: Content is protected !!