News March 12, 2025
కౌడిపల్లి: ఈనెల 17 నుంచి తునికి నల్ల పోచమ్మ జాతర

కౌడిపల్లి మండలం తునికి నల్ల పోచమ్మ దేవస్థానం జాతర ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈనెల 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి దేవదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 17న ధ్వజారోహణం, అభిషేకం, గణపతి పూజ, 18న అగ్నిగుండాలు, బోనాలు, 19న బండ్లు తిరుగుట, 20న పాచి బండ్లు, పల్లకీ సేవ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.ఈ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Similar News
News April 18, 2026
ప్రకృతి నడుమ ఆధ్యాత్మికతకు ప్రతీక ఏడుపాయల ఆలయం

ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలుస్తోంది. ఏడూ వాగులు సంగమించే ప్రదేశంలో వెలసిన వన దుర్గాభవాని అమ్మవారిని దర్శించేందుకు ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు వస్తారు. పురాణాల ప్రకారం అమ్మవారు స్వయంభువుగా వెలసి భక్తులను కాపాడుతున్నారని విశ్వాసం. మహాశివరాత్రి, జాతర సమయంలో ఆలయం సందడిగా మారుతుంది. ప్రకృతి సౌందర్యం మధ్యలో ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది.
News April 18, 2026
చరిత్రకు సజీవ సాక్ష్యం మెదక్ ఖిల్లా

మెదక్లో చారిత్రక కీర్తిని చాటుతూ నిలిచిన మెదక్ ఖిల్లా పర్యాటకులను ఆకర్షిస్తోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కోట కాకతీయుల కాలంలో నిర్మాణం చెంది, అనంతరం కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు అభివృద్ధి చేశారు. బలమైన గోడలు, అద్భుత నిర్మాణ శైలి ఖిల్లా వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పైభాగం నుంచి కనిపించే ప్రకృతి అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రాంత చరిత్రను గుర్తు చేస్తూ వారసత్వ చిహ్నంగా ఇది నిలిచింది.
News April 18, 2026
జనగణనకు సిద్ధం కావాలి: అదనపు కలెక్టర్

తూప్రాన్ ఐవోసీ భవనంలో శుక్రవారం జనగణనపై అదనపు కలెక్టర్ నగేశ్ సమీక్ష నిర్వహించారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రక్రియకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. బ్లాకులుగా విభజించి పకడ్బందీగా గణన చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో జయచంద్ర రెడ్డి, MRO చంద్రశేఖర్ రెడ్డి, MPDO సతీశ్ పాల్గొన్నారు. గణన సమయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


