News March 12, 2025

పరీక్ష జరిగి 2 నెలలు.. విడుదల కానీ ఫలితాలు

image

JNTU యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సంబంధించి రెండు, మూడో సంవత్సర విద్యార్థుల పరీక్షలు పూర్తయి 2 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఫలితాలను అధికారులు విడుదల చేయలేదు. ఫలితాలు విడుదల కాక విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికైనా అధికారులు ఫలితాలు విడుదల చేస్తారని కొండంత ఆశతో విద్యార్థులు ఎదురుచూస్తున్న అధికారుల తీరులో మార్పు లేకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 23, 2026

ప్రతి పంచాయతీ అంకాపూర్‌లాగా అభివృద్ధి చెందాలి: సీఎం

image

రైతులు లాభసాటి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. ఆదివారం సిద్దిపేట(D) నర్మెట సభలో మాట్లాడారు. రైతులు మిల్లెట్స్ ఆర్గానిక్, కాయగూరలు, ఆకుకూరలు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలన్నారు. పామాయిల్ సాగు లాభదాయకని, ఆదాయం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ అంకాపూర్‌లాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి రైతు కారు కొనుక్కునేలా లాభసాటి వ్యవసాయం చేస్తూ ఆదాయం పెంచుకోవాలన్నారు.

News March 23, 2026

మూలపేట పోర్టుపై రాజకీయ వేడి

image

శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో కీలకమైన మూలపేట పోర్టు పనుల్లో డొల్లతనం కనిపిస్తోందని కూటమిపై వైసీపీ విమర్శలు చేస్తోంది. అయితే ఇటీవల పోర్టుకు రోడ్డు, రైలు అనుసంధానానికి కేంద్రం 358 ఎకరాల భూమిని కేటాయించింది. ఇది అభివృద్ధికి పెద్ద పీఠం ఇవ్వనుందని కూటమి పేర్కొనగా..YCP నిర్మాణాలు చకచక జరగడం లేదని MAR30న పోర్టు సందర్శన కార్యక్రమం నిర్వహించనుంది. దీంతో జిల్లాలో అభివృద్ధి పేరుతో రాజకీయ వేడి రాజుకుంటోంది.

News March 23, 2026

HYD: ముంచుకొస్తోంది.. జర జాగ్రత్త!

image

వేసవి దృష్ట్యా HYDలో ఒక్కపూట బడులు సాగుతున్నాయి. ఈ గ్యాప్‌లో పిల్లలు సరదాగా ఈతకు వెళ్తుంటారు. ఒక్కోసారి ఈసరదా వెంటే విషాదం పొంచి ఉండే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాదీలు గతేడాది 8 మంది లోతు తెలియక, ప్రవాహ తాకిడికి మునిగిపోయారు. వేసవిలో రోజుకు నలుగురి చొప్పున ఈత సరదాకు బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. పెద్దలు, నిపుణుల సమక్షంలో పిల్లలకు ఈత నేర్పండి.