News March 12, 2025
గద్వాల కోట.. ఈ విషయం మీకు తెలుసా.?

తెలంగాణలోని అతిపెద్ద సంస్థానం జోగులాంబ గద్వాల కోట. తూర్పున అలంపూర్, పడమర రాయచూరు హద్దులుగా 360 గ్రామాలు కలిగి ఉన్నది. కర్నూల్ నవాబుల నుంచి కప్పం పొందిన సంస్థానంగా ఖ్యాతిగాంచింది. గద్వాల సంస్థానం మూల పురుషుడు బుడ్డారెడ్డి. గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజులలో పెద్ద సోమభూపాలుడిని జానపద కథకులు ముద్దుగా నల్ల సోమనాద్రిగా పిలుచుకునే వారు. ఇతడే గద్వాల కోట నిర్మాణ కర్తగా పేరు పోందారు.
Similar News
News October 28, 2025
లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత

TG: మల్లోజుల, ఆశన్న బాటలోనే మావోయిస్టు కీలక నేత లొంగిపోయారు. 45 ఏళ్లు అజ్ఞాతంలో ఉన్న రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ ఇవాళ DGP శివధర్ రెడ్డి ఎదుట సరెండర్ అయ్యారు. మంచిర్యాల(D) మందమర్రికి చెందిన ఆయన సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ 1980లో పీపుల్స్ వార్ ఉద్యమాలకు ఆకర్షితుడయ్యారు. 1984లో AITUC నేత అబ్రహం హత్య కేసులో అరెస్టై ADB సబ్ జైలు నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు.
News October 28, 2025
పారాది వద్ద పొంగిన వేగావతి

మొంథా తుఫాన్ ప్రభావంతో వేగావతి నది వరద ఉదృతి పెరిగింది. తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురవడంతో నది ప్రవాహం పెరగడంతో పారాది కాజ్ వే పైనుంచి వరదనీరు ప్రవహిస్తుంది. నది ఉదృతి పెరగడంతో నది పరివాహక ప్రాంతానికి ఎవరు వెళ్లవద్దని, పశువులు, గొర్రెలు, మేకలను తీసుకుని వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
News October 28, 2025
HYD: మావోయిస్ట్ పార్టీ కీలక సభ్యుడు ప్రకాశ్ లోంగుబాటు

మావోయిస్ట్ పార్టీలో తెలంగాణ నుంచి కీలక వ్యక్తి బండి ప్రకాశ్ లొంగిపోయారు. ఆ పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా గతంలో ఆయన పనిచేశారు. మావోయిస్ట్ పార్టీలో నేషనల్ పార్క్ ఏరియాలో ఈయన కీలక ఆర్గనైజర్గా తెలుస్తోంది. 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసిన రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ @ ప్రభాత్ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు.


