News March 12, 2025
గద్వాల కోట.. ఈ విషయం మీకు తెలుసా.?

తెలంగాణలోని అతిపెద్ద సంస్థానం జోగులాంబ గద్వాల కోట. తూర్పున అలంపూర్, పడమర రాయచూరు హద్దులుగా 360 గ్రామాలు కలిగి ఉన్నది. కర్నూల్ నవాబుల నుంచి కప్పం పొందిన సంస్థానంగా ఖ్యాతిగాంచింది. గద్వాల సంస్థానం మూల పురుషుడు బుడ్డారెడ్డి. గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజులలో పెద్ద సోమభూపాలుడిని జానపద కథకులు ముద్దుగా నల్ల సోమనాద్రిగా పిలుచుకునే వారు. ఇతడే గద్వాల కోట నిర్మాణ కర్తగా పేరు పోందారు.
Similar News
News March 27, 2026
WGL: స్టాక్ మార్కెట్ పేరుతో రూ.కోటి మోసం

వరంగల్ నగరంలో ఓ రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ను సైబర్ నేరగాళ్లు మోసం చేసి రూ.కోటి దోచుకున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో నకిలీ వెబ్సైట్ ద్వారా పరిచయం ఏర్పరచుకుని, విడతల వారీగా డబ్బులు జమ చేయించారు. చివరకు ఆదాయ పన్ను పేరుతో అదనంగా డబ్బు అడగడంతో అనుమానం వచ్చి విషయం బయటపడింది. బాధితుడి మనవడు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 27, 2026
విజయవాడ: చదివింది మూడు.. దొంగతనాలు 80

అంతర్రాష్ట్ర దొంగను గురువారం విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైమ్ ఏడీసీపీ రాజారావు వివరాల ప్రకారం.. మచిలీపట్నానికి చెందిన ఆరేపల్లి దుర్గారావు మూడో తరగతి వరకు చదువుకుని దొంగతనాలకు అలవాటు పడ్డాడు. దీంతో అతనిపై 80 కేసులు ఉన్నాయి. ఇతను ఇటీవల పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడగా నిఘా ఏర్పాటు చేసి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.3.50 లక్షల నగదు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
News March 27, 2026
బాలుడి హత్య కేసు: పోలీసులపై దాడికి యత్నం.. నిందితుడిపై కాల్పులు

అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడుకు చెందిన ఐదేళ్ల బాలుడు <<19481666>>హేమచంద్రను<<>> కిడ్నాప్ చేసి హత్య చేసిన సర్వేశ్పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో అతడు ఖాళీ బీరు సీసాతో పోలీసులపై తిరగబడ్డాడు. ఈ దాడిలో సీఐ రామసుబ్బయ్య, ఒక కానిస్టేబుల్ గాయపడినట్లు సమాచారం. హెచ్చరించినా లొంగకపోవడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.


