News March 12, 2025

తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు: CBN

image

AP: TDPతోనే మహిళా సాధికారత ప్రారంభమైందని అసెంబ్లీలో CM CBN అన్నారు. ‘ఎన్టీఆర్‌ మహిళలకు తొలిసారిగా ఆస్తి హక్కు కల్పించారు. కానీ తల్లి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి గతంలో CMగా(జగన్‌ను ఉద్దేశించి) ఉన్నారు. ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి తీసుకునేందుకు కోర్టుకెళ్లారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే వాటా ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలో పెట్టుకుంటోంది’ అని తెలిపారు.

Similar News

News March 13, 2025

ODI WC-2027: రోహిత్ కీలక నిర్ణయం?

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకూ ఆడేందుకు ఫిట్‌నెస్, ఫోకస్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇందుకు భారత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి ఆయన పని చేస్తారని టాక్. అభిషేక్‌ నుంచి బ్యాటింగ్, ఫిట్‌నెస్ టిప్స్ తీసుకుంటారని తెలుస్తోంది. కాగా IPLలో దినేశ్ కార్తీక్‌కు అభిషేక్ మెంటార్‌గా ఉన్నారు. ఆ సమయంలో DK చెలరేగి ఆడిన విషయం తెలిసిందే.

News March 12, 2025

NEP అమలు చేస్తే రిజర్వేషన్లు ఉండవు: స్టాలిన్

image

NEP అమలుతో దేశమంతా హిందీ భాషను అభివృద్ధి చేయాలని బీజేపీ భావిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. దీంతో స్థానిక భాషల గుర్తింపు తగ్గుతుందన్నారు. అంతేకాకుండా ఈ విద్యావిధానం అమలు చేస్తే రిజర్వేషన్లు ఉండవన్నారు. డీలిమిటేషన్‌తో ఉత్తర భారతంలో ఎంపీల సంఖ్య పెంచి అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ భావిస్తుందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని DMK దీనిని అడ్డుకుంటుందని తెలిపారు.

News March 12, 2025

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

image

AP: రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. 3,450 సెంటర్లలో 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. 156 ఫ్లైయింగ్, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షిస్తారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధిస్తారు. జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేస్తారు. హాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరూ మొబైల్ తీసుకెళ్లకూడదు. కంట్రోల్ రూమ్ నం. 08662974540.

error: Content is protected !!