News March 12, 2025

పల్నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత

image

స్థానిక పల్నాడు కలెక్టరేట్ వద్దకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. యువత పోరులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు, శ్రేణులతో కలిసి కలెక్టరేట్ లో వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

Similar News

News March 14, 2026

MBNR: టెన్త్ పరీక్షలు.. ఎస్పీ కీలక ఆదేశాలు

image

టెన్త్ పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాల పరిసరాలలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. పరీక్ష ప్రాంతాలలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డిజేలు ఉపయోగించి ఉరేగింపులు, ధర్నాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు. సెక్షన్-163 అమలు చేస్తున్నట్లు తెలిపారు.

News March 14, 2026

ఆదిలాబాద్: KU పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల

image

కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీల షెడ్యూల్ విడుదలైనట్లు KU అధికారులు పేర్కొన్నారు. KU పరిధిలోని ఉమ్మడి. ఆదిలాబాద్ జిల్లాలో 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫీజు ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 9వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో పరీక్షలు ఉంటాయని తెలిపారు.

News March 14, 2026

సంగారెడ్డి: ఎస్సీలకు 409 యూనిట్లు మంజూరు

image

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంగారెడ్డి జిల్లాలోని షెడ్యూలు కులాల అభ్యర్థులకు 409 యూనిట్లు మంజూరైనట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. లబ్ధిదారులకు రూ. 8.21 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా ఎస్సీల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యమని, వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.