News March 12, 2025
పల్నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత

స్థానిక పల్నాడు కలెక్టరేట్ వద్దకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. యువత పోరులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు, శ్రేణులతో కలిసి కలెక్టరేట్ లో వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Similar News
News January 17, 2026
H1B వీసాలు.. డాక్టర్లే ఎక్కువగా సంపాదిస్తున్నారట!

అమెరికాలో H1B వీసాలతో టెకీల కంటే మెడికల్ స్పెషలిస్టులే ఎక్కువగా సంపాదిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. కొందరు స్పెషలిస్టుల (రేడియాలజిస్టులు, కార్డియాలజిస్టులు, సర్జన్లు, న్యూరాలజిస్టులు) జీతాలు 3 లక్షల డాలర్ల కంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. డాక్టర్ల తర్వాత లాయర్లు, కంప్యూటర్ సిస్టమ్ మేనేజర్లు, ఫైనాన్స్ మేనేజర్లు లక్ష-2 లక్షల డాలర్లు సంపాదిస్తున్నారని తెలిపింది.
News January 17, 2026
సంగారెడ్డిలో 19న ప్రజావాణి రద్దు

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఈనెల 19న జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించాలని, తదుపరి నిర్వహణ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఆమె వివరించారు.
News January 17, 2026
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రిజర్వేషన్లు ఇలా..

NLG మేయర్ (జనరల్ మహిళ), MLG (జనరల్ మహిళ), DVK (బీసీ మహిళా), హాలియా (UR ), నందికొండ (SC జనరల్), చండూరు (UR), చిట్యాల (జనరల్ మహిళ), SRPT (UR), KDD(జనరల్ మహిళ), HNR (బీసీ జనరల్), నేరేడుచర్ల (UR), తిరుమలగిరి (UR), భువనగిరి (జనరల్ మహిళ), చౌటుప్పల్ (జనరల్ మహిళ ), యాదగిరిగుట్ట (జనరల్ మహిళ), పోచంపల్లి (UR), మోత్కూరు (ఎస్సీ మహిళ ), ఆలేరు (బీసీ మహిళ).


