News March 12, 2025

పల్నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత

image

స్థానిక పల్నాడు కలెక్టరేట్ వద్దకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. యువత పోరులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు, శ్రేణులతో కలిసి కలెక్టరేట్ లో వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

Similar News

News March 12, 2025

సిద్దిపేట: సమాజంలో మహిళల పాత్ర కీలకం: సీపీ

image

సమాజ నిర్మాణంలో మహిళలే కీలకమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పట్టణ త్రీ టౌన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పాల్గొని మాట్లాడారు. సమాజంలో మహిళలు అని రంగాల్లో రానిస్తున్నారని అన్నారు.

News March 12, 2025

GWL: అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ, తాగునీరు, ఇందిరమ్మ ఇండ్లు, LRS ప్రక్రియ గురించి సమావేశం నిర్వహించారు. ఉపాధి పనులు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ఉండకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు.

News March 12, 2025

NEP అమలు చేస్తే రిజర్వేషన్లు ఉండవు: స్టాలిన్

image

NEP అమలుతో దేశమంతా హిందీ భాషను అభివృద్ధి చేయాలని బీజేపీ భావిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. దీంతో స్థానిక భాషల గుర్తింపు తగ్గుతుందన్నారు. అంతేకాకుండా ఈ విద్యావిధానం అమలు చేస్తే రిజర్వేషన్లు ఉండవన్నారు. డీలిమిటేషన్‌తో ఉత్తర భారతంలో ఎంపీల సంఖ్య పెంచి అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ భావిస్తుందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని DMK దీనిని అడ్డుకుంటుందని తెలిపారు.

error: Content is protected !!