News March 12, 2025

సిద్దిపేట: జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై త్వరలో సమావేశం

image

రాష్ట్రంలో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పథకాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు గాను త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి.దామోదర్ రాజ నరసింహా హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా విరాహత్ అలీ ఆధ్వర్యంలో నాయకులు మంత్రి దామోదరకు వినతిపత్రాన్ని అందజేశారు.

Similar News

News March 7, 2026

ప.గో: చంద్రబాబు తప్పిదంతోనే డయాఫ్రం వాల్‌కు నష్టం.. వైసీపీ ట్వీట్

image

పోలవరం స్పిల్‌వే, కాఫర్ డ్యాంలు పూర్తిచేయకుండానే డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించడం వల్లే నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక స్పష్టం చేసిందని, చంద్రబాబు తప్పిదం వల్లే ఇలా జరిగిందని ‘ఎక్స్’ వేదికగా వైసీపీ ట్వీట్ చేసింది. 2022లో అసెంబ్లీలో వైఎస్ జగన్ ఇదే విషయాన్ని చెప్పారని, అప్పట్లో టీడీపీ నేతలు ఈ వాస్తవాన్ని అంగీకరించలేదని ఆ పార్టీ తాజా ట్వీట్‌లో గుర్తు చేసింది.

News March 7, 2026

పెద్దపల్లి: గ్రామ పంచాయతీలకు ₹21.04 కోట్ల నిధులు

image

PDPL జిల్లాలోని 13 మండలాల పరిధిలోని జీపీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ₹21.04 కోట్లు విడుదలైనట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. 2023-25 ఆర్థిక సంవత్సరాలకు గాను 3 విడతల్లో ఈ నిధులను కేటాయించామన్నారు. ఇందులో అన్‌టైడ్‌ గ్రాంట్‌ కింద ₹5.73 కోట్లు, టైడ్‌ గ్రాంట్‌ కింద ₹15.31 కోట్లు విడుదలయ్యాయని వివరించారు. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

News March 7, 2026

సుందర్ పిచాయ్ జీతం రూ.6,361 కోట్లు!

image

గూగుల్ CEO సుందర్ పిచాయ్ శాలరీ ప్యాకేజీ భారీగా పెరిగింది. వచ్చే మూడేళ్ల కాలానికి $692 మిలియన్ల(రూ.6,361 కోట్లు)ను అందుకోనున్నారు. ఇందులో వార్షిక జీతం, రిస్ట్రిక్టెడ్ స్టాక్ వెస్టింగ్, అనుబంధ సంస్థల్లో షేర్ల వాటా కలిసి ఉంటుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్యాకేజీ తీసుకుంటున్న సీఈవోలలో ఒకరుగా నిలిచారని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. కాగా 2004లో గూగుల్‌లో చేరిన సుందర్ 2015లో సీఈవో అయ్యారు.