News March 12, 2025
బాపట్ల కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చిన వైసీపీ నేతలు

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి నాగర్జున కోరారు. ఈ మేరకు వైసీపీ నాయకులతో కలిసి బుధవారం బాపట్ల కలెక్టర్ వెంకట మురళికి వినతిపత్రం అందజేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన అన్నారు.
Similar News
News July 7, 2025
స్థానిక సంస్థలపై ఫోకస్: రామ్చందర్ రావు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తమకు సవాల్ అని BJP రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్ రావు అన్నారు. బలమైన ప్రతిపక్షం ఉంటే బైఎలక్షన్లో అధికార పార్టీ గెలవదని జోస్యం చెప్పారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలపై BJP ఫోకస్ చేయలేదని, ఈ సారి వీటిపై ఫోకస్ పెడతామని స్పష్టం చేశారు. 25 రోజుల్లో పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీని ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్ర కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
News July 7, 2025
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను https://navodaya.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ప్రవేశాలకు డిసంబర్ 13న పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News July 7, 2025
GET READY: 7.03PMకి ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ప్రోమో

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘కింగ్డమ్’ సినిమా విడుదల తేదీ ప్రకటనపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్ర విడుదల తేదీతో కూడిన ప్రోమో వీడియోను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 7.03కి విడుదల చేయనున్నట్లు వెల్లడిస్తూ స్పెషల్ పోస్టర్ను షేర్ చేశారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.