News March 23, 2024

పుట్టపర్తిలో బైకులు ఢీకొని వ్యక్తి మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో శనివారం ఉదయం రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని ప్రధాన రహదారిలో హోటల్ నిర్వాహకుడు దామోదర్ ఈరోజు ఉదయం బైక్‌పై వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొని తలకు తీవ్ర గాయమై మృతిచెందాడు. మృతుడు మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద కమ్మవారిపల్లికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 9, 2025

అనంత: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 401 అర్జీలు

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా వ్యాప్తంగా వచ్చిన సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలను నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 401 వినతి పత్రాలు వచ్చినట్లు తెలిపారు.

News September 9, 2025

అనంత: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 401 అర్జీలు

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా వ్యాప్తంగా వచ్చిన సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలను నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 401 వినతి పత్రాలు వచ్చినట్లు తెలిపారు.

News September 9, 2025

అనంతపురం జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలు

image

అనంతపురం జిల్లాకు ఈనెల 10న CBN విచ్చేస్తున్న సందర్భంగా ట్రాఫిక్ మళ్లించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు అనంతపురం నగరానికి సమీపాన ఉన్న వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, నార్పల క్రాస్, బత్తలపల్లి, ధర్మవరం, ఎన్‌ఎస్ గేట్ మీదుగా NH-44 జాతీయ రహదారికి మళ్లించినట్లు ఎస్పీ తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.