News March 23, 2024
పుట్టపర్తిలో బైకులు ఢీకొని వ్యక్తి మృతి

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో శనివారం ఉదయం రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని ప్రధాన రహదారిలో హోటల్ నిర్వాహకుడు దామోదర్ ఈరోజు ఉదయం బైక్పై వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొని తలకు తీవ్ర గాయమై మృతిచెందాడు. మృతుడు మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద కమ్మవారిపల్లికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 26, 2025
JNTU: OTPRIలో 31న ప్రాంగణ నియామకాలు

అనంతపురం జేఎన్టీయూ OTPRIలో ఈ నెల 31న ఉదయం 9:00 గంటలకు B.Pharm, M.Pharm విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నట్లు OTPRI డైరెక్టర్ సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ సి.గోపినాథ్ ఆదివారం తెలిపారు. 2022-25లో గ్రాడ్యుయేషన్ (B.Pharm, M.Pharm) పూర్తి చేసుకునే విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని తెలిపారు.
News October 26, 2025
నేరస్తులు, రౌడీ షీటర్లపై నిఘా ఉంచండి: ఎస్పీ

నేరస్తులు, రౌడీ షీటర్లపై ఉక్కు పాదం మోపినట్లు ఎస్పీ జగదీష్ ఆదివారం వెల్లడించారు. జిల్లాలోని రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వాహన తనిఖీలు చేపట్టాలన్నారు. చోరీలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. మట్కా, గుట్కా, చైనీ, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను తరలించినా, ప్రోత్సహించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు.
News October 26, 2025
JNTUలో 28, 29, 30న ఇంటర్వ్యూలు

అనంతపురం జేఎన్టీయూలో ఈ నెల 28, 29, 30న కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీంకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో 45 మంది బోధన సిబ్బంది పాల్గొననున్నారు. 28 మంది సీనియర్ ప్రొఫెసర్కు, 6 మంది ప్రొఫెసర్కు, 11 మంది అసోసియేట్ ప్రొఫెసర్ పదోన్నతులకు దరఖాస్తులు చేసుకున్నట్లు వివరించారు.


