News March 12, 2025

ఇల్లు కట్టుకున్నవారికి అదనపు లబ్ధి: కలెక్టర్

image

2016-17 నుంచి 2023-24 వరకు పీఎంఏవై ద్వారా గృహాలు మంజూరై నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నవారికి ప్రభుత్వం అదనపు సహాయం అందజేస్తుందని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్న లబ్ధిదారులలో ఎస్సీలు, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. గృహ నిర్మాణ సిబ్బంది, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News July 7, 2025

KNR: సర్కార్ స్కూల్ చిన్నారులకు కేంద్రమంత్రి శుభవార్త

image

కేంద్రమంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీతో పాటు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు కిట్స్ అందజేయనున్నారు. KNR లోక్‌సభ పరిధిలోని 50-60వేల చిన్నారులకు స్కూల్ బ్యాగ్, నోటు బుక్స్, పెన్స్, పెన్సిల్, వాటర్ బాటిల్, షూ కిట్‌ను అందించేస్తారని SGTU నేతలు తెలిపారు. ఒక్కొక్కరికి ₹1000 విలువైన కిట్లు అందనున్నాయి. ఈ సందర్భంగా మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

News July 7, 2025

శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద

image

AP: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. జూరాల, సుంకేశుల నుంచి 1.98 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 59వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 880.40 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 190.33 TMCలుగా ఉంది. రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

News July 7, 2025

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి: DEO

image

జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2025 సంవత్సరానికి అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మండల, ఉప విద్యాశాఖ అధికారి ద్వారా ఈనెల 13వ తేదీలోగా http//nation-alawardstoteachers.education.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.