News March 12, 2025

ఇల్లు కట్టుకున్నవారికి అదనపు లబ్ధి: కలెక్టర్

image

2016-17 నుంచి 2023-24 వరకు పీఎంఏవై ద్వారా గృహాలు మంజూరై నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నవారికి ప్రభుత్వం అదనపు సహాయం అందజేస్తుందని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్న లబ్ధిదారులలో ఎస్సీలు, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. గృహ నిర్మాణ సిబ్బంది, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News November 8, 2025

రేవులపల్లి VOAపై అసత్య ప్రచారం తగదు- తిమ్మప్ప

image

ధరూర్ మండలం రేవులపల్లి VAOపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, అది తగదని VAOల సంఘం గద్వాల జిల్లా కార్యదర్శి సంగాల తిమ్మప్ప పేర్కొన్నారు. శనివారం జిల్లా సీఐటీయూ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో గతంలో వీఏఓ అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అందుకు సంబంధించి పూర్తిస్థాయిలో ఆడిట్ జరిగిందన్నారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని అన్నారు.

News November 8, 2025

USలో 10 లక్షలకు పైగా ఉద్యోగాల్లో కోత

image

AI, ఆటోమేషన్, ఇన్‌ఫ్లేషన్, టారిఫ్‌లు.. వెరసి US జాబ్ మార్కెట్ సంక్షోభంలో పడింది. OCTలో 1,53,074 జాబ్స్‌కు కోత పడినట్లు ‘ఛాలెంజర్ గ్రే క్రిస్టమస్’ తెలిపింది. SEPతో పోలిస్తే 3 రెట్లు అధికమని పేర్కొంది. 2025లో ఇప్పటివరకు లేఆఫ్‌ల సంఖ్య 1.09Mకు చేరినట్లు వెల్లడించింది. కరోనా తర్వాత అత్యధిక లేఆఫ్‌లు ఇవేనని చెప్పింది. కాగా గత 2 ఏళ్లతో పోలిస్తే జాబ్ మార్కెట్ ఇప్పుడే స్లో అయినట్లు నిపుణులు పేర్కొన్నారు.

News November 8, 2025

మహిళలు వేధింపులపై మౌనంగా ఉండొద్దు: ఎస్పీ నరసింహ

image

మహిళలు, బాలికలు లైంగిక వేధింపులను ధైర్యంగా బయటకువచ్చి చెప్పాలని ఎస్పీ నరసింహ సూచించారు. పనిచేసే చోట, కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో మహిళలు, బాలికలు ఆపద సమయాల్లో హెల్‌లైన్‌ నంబర్లు సంప్రదించాలని ఎస్పీ అన్నారు. ‘వేధింపులపై మౌనంగా ఉండొద్దు.. మీ కోసం షీ టీమ్స్‌ పనిచేస్తాయని’ ఎస్పీ మహిళలకు సూచించారు.