News March 12, 2025
సంగారెడ్డి: ‘పరీక్షకు 352 మంది విద్యార్థులు గైర్హాజరు’

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 96.81% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.16,727 మంది విద్యార్థులకు గాను 16,375 మంది విద్యార్థులు హాజరయ్యారని, 352 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
Similar News
News January 18, 2026
ట్రంప్ వద్దకు నోబెల్ శాంతి.. స్పందించిన కమిటీ

ట్రంప్నకు వెనిజులాకు చెందిన మచాడో తన <<18868941>>శాంతి<<>> బహుమతిని ఇవ్వడంపై భిన్నమైన స్పందన రాగా తాజాగా నోబెల్ కమిటీ స్పందించింది. మెడల్ ఎవరి వద్ద ఉన్నా తాము ప్రకటించిన విజేతలో మార్పు ఉండదని తెలిపింది. విజేతలు తీసుకునే నిర్ణయాలపై అవార్డు కమిటీ ఎలాంటి కామెంట్లు చేయబోదని పేర్కొంది. మెడల్ను అమ్మడం, దానం చేయడం వంటి వాటిపై పరిమితులు లేవని తెలిపింది. గతంలోనూ పలువురు మెడల్స్ను డొనేట్/అమ్మడం చేసినట్లు వెల్లడించింది.
News January 18, 2026
NGKL జిల్లాలో 1,403 టన్నుల యూరియా నిల్వలు

NGKL జిల్లాలో 1,403 టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెలలో మరో 4,349 టన్నుల యూరియా జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. ఈ యాసంగిలో రైతులకు ఇప్పటివరకు 1.44 లక్షల బస్తాల యూరియా అధికంగా పంపిణీ చేసినట్లు చెప్పారు. మొక్కజొన్న పంట సాగుచేసిన రైతులందరికీ దాదాపు యూరియా పంపిణీ చేయడం జరిగిందన్నారు.
News January 18, 2026
ప్చ్.. రో‘హిట్’ అవ్వలేదు

న్యూజిలాండ్తో సిరీస్లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపర్చారు. మూడో వన్డేలో 11 పరుగులే చేసి ఫౌల్క్స్ బౌలింగ్లో వెనుదిరిగారు. సిరీస్ మొత్తంగా 61 పరుగులే చేశారు. మరో ఆరు నెలల వరకు వన్డే మ్యాచ్లు లేవు. హిట్ మ్యాన్ నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకపోవడం ఫ్యాన్స్ను నిరాశకు గురిచేస్తోంది. మళ్లీ IPL-2026లోనే రోహిత్ ఆటను చూడవచ్చు. ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ 3వ ర్యాంకులో కొనసాగుతున్నారు.


