News March 12, 2025
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చెరువులను ధ్వంసం చేయాలి

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 438 ఆక్వా చేపల చెరువులను త్వరితగతిన ధ్వంసం చేయాలని అధికారులకు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలు జరీ చేశారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 84 చెరువులను ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 21, 2026
ధురంధర్-2పై టాలీవుడ్ స్టార్ల ప్రశంసలు.. ప్రకాశ్ రాజ్ కామెంట్స్ వైరల్

ధురంధర్-2 సినిమాపై అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ సహా దక్షిణాది స్టార్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే బాలీవుడ్ స్టార్లు ఎవరూ స్పందించలేదు. ఇదే విషయంపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్కు ప్రకాశ్ రాజ్ ఇటీవల ఇచ్చిన సమాధానం వైరలవుతోంది. ఎవరో కోరడం వల్లే వీరు స్పందిస్తున్నారనే అర్థం వచ్చేలా ‘దక్షిణాదికి సైతం ఆబ్లిగేషన్స్ విస్తరిస్తున్నాయనడానికి ఇవి సూచనలు’ అని పేర్కొన్నారు.
News March 21, 2026
LC యాప్తో విద్యుత్ సిబ్బందికి భద్రత: ASF SE

ASF జిల్లాలో విద్యుత్ ప్రమాదాలను తగ్గించేందుకు విద్యుత్ శాఖ LC యాప్ ప్రవేశపెట్టినట్లు ASF SE ఉత్తమ్ జాడే తెలిపారు. ఈ యాప్ ద్వారా లైన్ క్లియర్ అనుమతులు డిజిటల్గా జారీ అవుతాయని, సిబ్బంది పని చేసే ఫీడర్, లైన్ వివరాలు స్పష్టంగా అందుతాయన్నారు. తప్పుడు ఎంపికలకు అవకాశం లేకుండా వ్యవస్థ పనిచేస్తుందని, అధికారులు, సిబ్బంది మధ్య రియల్టైమ్ సమాచార మార్పిడి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
News March 21, 2026
భార్యతో ఫోన్లో మాట్లాడుతుండగా మిస్సైల్ దాడి.. భారతీయుడు మృతి

సౌదీలో జరిగిన మిస్సైల్ దాడిలో ఓ భారతీయుడు మరణించాడు. యూపీకి చెందిన రవి గోపాల్ (26) రియాద్లోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. మార్చి 18న భార్యతో ఫోన్లో మాట్లాడుతుండగా ఫ్యాక్టరీ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. మిస్సైల్ శకలాలు మీద పడటంతో రవి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడని బంధువులు చెప్పారు. మృతదేహాన్ని త్వరగా ఇండియాకు పంపేందుకు సౌదీలోని ఇండియన్ ఎంబసీ ప్రయత్నిస్తోంది.


