News March 12, 2025
గార్ల: బైక్ యాక్సిడెంట్ మహిళకు తీవ్ర గాయాలు

గార్ల మండలంలోని పూమ్యా తండా శేరిపురం వెళ్లే రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు బుధవారం ఢీకొన్నాయి. ఒక ద్విచక్ర వాహనంపై మహిళా డ్రైవింగ్ చేస్తుండగా, మరొక వాహనం ఎదురుగా వచ్చి ఢీకొనడంతో మహిళకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. తోటి వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News March 13, 2025
రాజనీతి శాస్త్రంలో నిర్మల్ వాసికి డాక్టరేట్

నిర్మల్ పట్టణానికి చెందిన రాజనీతి శాస్త్ర లెక్చరర్ కొండా గోవర్ధన్ ఇటీవల హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. రాజనీతి శాస్త్రంలో పొలిటికల్ అవేర్నెస్ ఆఫ్ గ్రాస్ రూట్ లెవెల్ లీడర్షిప్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ మేరకు బుధవారం ఆయనను పలువురు మిత్రులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్వామి, సాగర్రెడ్డి, మహేశ్, అశోక్ ఉన్నారు.
News March 13, 2025
SRD: బ్యాంకింగ్లో ఉచిత శిక్షణ

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు బ్యాంకింగ్ కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ టి.ప్రవీణ్ తెలిపారు. డిగ్రీ అర్హత కలిగి 26 ఏళ్ల లోపు గల బీసీ అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 15 నుంచి ఏప్రిల్ 8 వరకు www.tgbcstudycircle.cgg.gov.inలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 12న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు.
News March 13, 2025
మల్దకల్: పట్టు వదలని విక్రమార్కుడు 4 ఉద్యోగాలు సాధించాడు

మల్దకల్ మం. ఎల్కూరుకి చెందిన నిరుపేద రైతు కూలి బిడ్డ మహమ్మద్ సుభాన్ 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ధరూర్ మం.లో 2014లో పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాడు. 2024లో ప్రభుత్వ గురుకుల పాఠశాల టీచర్, జూనియర్ లెక్చరర్గా ఉద్యోగాలు సాధించాడు. 2023లో టీజీపీఎస్సీ నిర్వహించిన జూనియర్ లెక్చరర్ల రాతపరీక్షలో ప్రతిభ చాటి ఫిజిక్స్ లెక్చరర్గా ఉద్యోగం సంపాదించాడు. ఈ మేరకు నియామకపత్రాన్ని సీఎం చేతుల మీదుగా అందుకున్నారు.