News March 12, 2025

VZM: పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

image

ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 119 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. 1,124 మంది చొప్పున రెండు విడతలకు 2248 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News April 1, 2026

క్రికెట్ బెట్టింగులపై కఠిన చర్యలు: VZM ఎస్పీ

image

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్రికెట్ బెట్టింగులు నిర్వహించినా, పాల్గొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా SP ఏ.ఆర్.దామోదర్ మంగళవారం హెచ్చరించారు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో యువత బెట్టింగుల జోలికి పోవొద్దని ఆయన సూచించారు. బెట్టింగులు చట్టవిరుద్ధమని, ఇందులో పాల్గొనే వారిపై కేసులు నమోదు చేసి రౌడీషీట్లు కూడా తెరుస్తామని వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగులతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని SP సూచించారు.

News March 31, 2026

జూన్‌లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో మంజూరైన గృహ నిర్మాణాలన్నింటినీ ఈ ఏడాది జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ ప్రగతిపై మంగళవారం హౌసింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో లేఅవుట్లలో 16,316 ఇళ్లు, సొంత స్థలాల్లో 3,161 ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.

News March 31, 2026

VZM: ఆసుపత్రుల భవన నిర్మాణ పనులు పూర్తిచేయాలి

image

జిల్లాలో నిర్మాణంలో గల ఆసుపత్రుల నూతన భవన నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో నిర్మాణంలో గల భోగాపురం, ఎస్.కోట, నెల్లిమర్ల, బాడంగి, చీపురుపల్లి, గజపతినగరం, రాజాం, బొబ్బిలి ఆసుపత్రుల నూతన భవనాల పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.