News March 12, 2025
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

AP: రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. 3,450 సెంటర్లలో 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. 156 ఫ్లైయింగ్, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షిస్తారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధిస్తారు. జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేస్తారు. హాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరూ మొబైల్ తీసుకెళ్లకూడదు. కంట్రోల్ రూమ్ నం. 08662974540.
Similar News
News March 13, 2025
రోహిత్ తనకంటే జట్టు గురించే ఎక్కువ ఆలోచిస్తారు: సెహ్వాగ్

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిస్వార్థంగా ఆలోచిస్తారంటూ భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ప్రశంసించారు. ‘రోహిత్ కెప్టెన్సీని మనం తక్కువ అంచనా వేస్తుంటాం. పలు ఐసీసీ టైటిల్స్ గెలిచిన కెప్టెన్గా ఆయన ధోనీ సరసన ఉన్నారు. ఆటగాళ్లతో చక్కటి సమన్వయం, ముందుండి నడిపించడంలో రోహిత్ శైలి అద్భుతం. ఏ ఆటగాడైనా అభద్రతతో ఉంటే అతడిలో విశ్వాసాన్ని నింపుతుంటారు. మొత్తంగా ఆయన తిరుగులేని నాయకుడు’ అని కొనియాడారు.
News March 13, 2025
శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 68,509 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో 23,105 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఒక్క రోజులో స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.86 కోట్లు సమకూరింది.
News March 13, 2025
ఢిల్లీలో CM రేవంత్.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఫోకస్?

TG CM రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్తో భేటీ కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న పలువురు విదేశాల్లో తలదాచుకుంటుండగా, వారిని స్వదేశానికి రప్పించే విషయంపై ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే గల్ఫ్ కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. అనంతరం పార్టీ అధిష్ఠానంతో మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశముంది.