News March 12, 2025

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

image

AP: రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. 3,450 సెంటర్లలో 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. 156 ఫ్లైయింగ్, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షిస్తారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధిస్తారు. జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేస్తారు. హాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరూ మొబైల్ తీసుకెళ్లకూడదు. కంట్రోల్ రూమ్ నం. 08662974540.

Similar News

News January 1, 2026

AQI: దేశంలో హైదరాబాద్ బెస్ట్

image

దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వాయు కాలుష్యం తక్కువగా ఉంది. మెట్రోపాలిటన్ నగరాల్లో మంగళవారం AQI 150కి పైగానే ఉండగా హైదరాబాద్‌లో 99గా నమోదైంది. ఢిల్లీలో 388, ముంబై 136, కోల్‌కతా 170, చెన్నై 186, బెంగళూరు 115, అహ్మదాబాద్‌ 164, పుణేలో 247గా ఉంది. కాలుష్యం తక్కువగా ఉండటంతో చాలా మంది హైదరాబాద్‌వైపు చూస్తున్నారు. దేశానికి రెండో రాజధాని చేయాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది.

News January 1, 2026

ఇతిహాసాలు క్విజ్ – 114

image

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి ఎవరు? ఆమె భర్త పేరేంటి? ఆయనను ఎవరు చంపేశారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 1, 2026

AIIMS మంగళగిరిలో 76 పోస్టులు.. అప్లై చేశారా?

image

<>AIIMS<<>> మంగళగిరిలో 76 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MD/MS/DNB/DM/Mch, MSc, M.Biotech, PhD అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, STలకు రూ.1000. JAN 6-8వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in