News March 12, 2025
అనకాపల్లి: 325 మంది విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షకు 325 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా పరీక్షల కమిటీ కన్వీనర్ బి.సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 10,136 మంది హాజరుకావాల్సి ఉండగా 9,905 మంది హాజరైనట్లు తెలిపారు. వోకేషనల్ కోర్సుకు సంబంధించి 2,345 మంది హాజరు కావలసి ఉండటం 2,251 మంది హాజరైనట్లు తెలిపారు.
Similar News
News September 18, 2025
విజయవాడ: రేపటితో ముగియనున్న గడువు.. త్వరపడండి

CRDA ఇంజినీరింగ్ విభాగంలో 102 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 50 అసిస్టెంట్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 25 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 15 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, చీఫ్(4), సూపరింటెండింగ్ ఇంజినీర్(8) పోస్టులు భర్తీ చేస్తున్నామని..అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. దరఖాస్తు వివరాలకు https://crda.ap.gov.in/ చూడాలన్నారు.
News September 18, 2025
విశాఖలో మెడికో విద్యార్థిని ఆత్మహత్య

మాకవరపాలేనికి చెందిన శివానీ జోత్స్న (21) MBBS సెంకండ్ ఇయర్ చదువుతోంది. ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్స్ ఉండడంతో వాటిని క్లియర్ చేయలేనేమోనని ఆందోళన చెందింది. ఈ క్రమంలోనే బుధవారం సుజాతానగర్లోని తన మేనమామ ఉంటున్న అపార్ట్మెంట్ పైనుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలిచగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 18, 2025
HYD: నల్లాబిల్లు కట్టాలని క్రెడిట్కార్డు ఖాళీ చేశాడు!

సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో డబ్బు కాజేస్తున్నారు. పెండింగ్ నల్లా బిల్లు చెల్లించాలని ఆన్లైన్ లింక్ పంపి ఓ వ్యక్తి నుంచి రూ.95,237 కాజేశారు. ఎల్బీనగర్ మన్సూరాబాద్ శ్రీరామ్ నగర్ కాలనీవాసి సంకలమద్ది శ్రీనివాస్ రెడ్డికి SEPT 11న వాటర్ బోర్డుకు బిల్లు చెల్లించాలని 6303323494 నుంచి వాట్సప్ లింక్ పంపాడు. ఈనెల బిల్ చెల్లించలేదని, నిజమేనని నమ్మి APK ఫైల్ ఇన్స్టాల్ చేయగా క్రెడిట్ కార్డు కాళీ అయింది.