News March 23, 2024
ఉల్లి ఎగుమతులపై నిషేధం పొడిగింపు
ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నిషేధంపై గతంలో విధించిన గడవు ఈనెల 31న ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కాగా ఈ నిర్ణయాన్ని పలువురు నిపుణులు తప్పుపడుతున్నారు. ఈ నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని.. నిజానికి ఇప్పుడు బ్యాన్ పొడగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Similar News
News October 6, 2024
ఊసరవెల్లి రాజకీయాలకు కేరాఫ్ బాబు: VSR
AP: రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు సీఎం చంద్రబాబు ఊసరవెల్లిలా ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తుంటారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు మనోగతం! రంజాన్, మిలాద్ ఉన్ నబి అయిపోయాయి. దసరా పండుగ అయిపోవస్తోంది. ఇప్పుడు అర్జంట్గా బైబిల్ కావాలి. ఎక్కడ, ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్. క్రిస్మస్ దగ్గరకు వచ్చేస్తోంది. వేషం మార్చాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.
News October 6, 2024
ఇజ్రాయెల్ దాడిలో 26మంది మృతి: హమాస్
గాజాపై ఇజ్రాయెల్ చేసిన తాజా దాడిలో ఓ మసీదులో 26మంది ప్రాణాలు కోల్పోయారని హమాస్ తెలిపింది. డెయిర్ అల్-బలాలో ఉన్న ఆ మసీదులో శరణార్థులు తల దాచుకున్నారని పేర్కొంది. అనేకమంది తీవ్రగాయాలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. అటు ఇజ్రాయెల్ ఆ ప్రకటనను ఖండించింది. హమాస్ ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్ని తాము అత్యంత కచ్చితత్వంగా గుర్తించి ధ్వంసం చేశామని, అందులో హమాస్ కమాండ్ సెంటర్ ఉందని పేర్కొంది.
News October 6, 2024
IPL Rules: ఈ యంగ్ క్రికెటర్లు ఇక కోటీశ్వరులు!
మారిన IPL రిటెన్షన్ పాలసీతో యంగ్ క్రికెటర్లు రూ.కోట్లు కొల్లగొట్టబోతున్నారు. వేలానికి ముందు ఫ్రాంచైజీలు ఆరుగురిని రిటెయిన్ చేసుకోవచ్చు. ఐదుగురు క్యాప్డ్ (భారత, విదేశీ), గరిష్ఠంగా ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు. బంగ్లా టీ20 సిరీసుకు మయాంక్ యాదవ్ LSG, నితీశ్ కుమార్ SRH, హర్షిత్ రాణా KKR ఎంపికయ్యారు. దీంతో వీరిని తీసుకుంటే రూ.11-18 కోట్లు ఇవ్వాల్సిందే. రింకూ సైతం కోటీశ్వరుడు అవుతారు.