News March 13, 2025

NRPT: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 86 మంది గైర్హాజరయ్యారు

image

నారాయణపేట జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి దర్శనం వెల్లడించారు. జనరల్ విద్యార్థులు 3,527 మందికి, 3460 మంది హాజరుకాగా, 67 మంది గై హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 547 మందికి 528 మంది పరీక్షలకు హాజరయ్యారు. 19 మంది గై హాజరైనట్లు తెలిపారు. వివిధ మండలాలను ప్లేయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి.

Similar News

News April 4, 2026

నేను గంగూలీని కాదు.. కానీ బెంగాలీనే: లియాండర్ పేస్

image

తాను బెంగాలీ కాదంటూ వస్తున్న విమర్శలపై టెన్నిస్ దిగ్గజం, బీజేపీ నేత లియాండర్ పేస్ ఘాటుగా స్పందించారు. ‘నువ్వు బెంగాలీనేనా’ అని ఎవరైనా అడిగితే బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా పేరు గంగూలీ కాకపోవచ్చు. కానీ నేను బెంగాలీనే. మా నాన్నది పోర్చుగీస్ కావచ్చు. నేను ఈ దేశానికి చెందిన వాడినే. కోల్‌కతాలోనే పుట్టాను. సౌత్ క్లబ్‌లో నా టెన్నిస్ జర్నీ మొదలైంది’ అని చెప్పుకొచ్చారు.

News April 4, 2026

15వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్!

image

త్వరలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CGL-2026 నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. దాదాపు 15వేల అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్), ఎస్సై, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తదితర గ్రూప్-B, C పోస్టులు ఉన్నాయి. దీనికి డిగ్రీ అర్హత ఉండాలి. నోటిఫికేషన్ విడుదల అయ్యాక దరఖాస్తు తేదీలు వెల్లడించనున్నారు.

News April 4, 2026

VJA: మహిళల ఆర్థిక ప్రగతికి ‘సెంట్రో మాల్’ వేదిక!

image

మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా NTR కలెక్టర్ లక్ష్మీశా, కృష్ణా కలెక్టర్ బాలాజీలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ MG రోడ్డులోని LEPL సెంట్రో మాల్‌లో మహిళా పారిశ్రామికవేత్తల స్వయం ఉపాధి ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక స్టాళ్లను కేటాయించారు. శనివారం ఈ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్లు.. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు నేరుగా మార్కెట్ కల్పించడమే తమ ఉద్దేశమని తెలిపారు.