News March 13, 2025
ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మార్కెట్లు, దుకాణాల వద్ద ఇందుకు అవసరమైన ప్రత్యామ్నాయాలు కల్పించాలని చెప్పారు. బుధవారం అమరావతి సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.
Similar News
News March 14, 2025
ఒంగోలు: ఇళ్లు నిర్మించుకునే వారికి గుడ్ న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి ఆర్ధిక తోడ్పాటు కల్పిస్తూ అదనపు సాయంగా రూ.50 వేల నుంచి లక్ష రూపాయలు మంజూరు చేస్తుంది. క్షేత్ర స్థాయిలో గృహ నిర్మాణ లబ్దిదారులకు అవగాహన కల్పిస్తూ త్వరగా ఇల్లు నిర్మించుకునేలా దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News March 14, 2025
సంతోషకర వాతావరణంలో హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

మతసామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని, ఇబ్బంది కలిగించవద్దని తెలిపారు. సంప్రదాయ పండుగలు ఏవైనా ప్రజలు కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఇలాంటి పండుగల సమయంలో యువత ఆదర్శంగా మెలగాలని సూచించారు.
News March 14, 2025
ఒంగోలులో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

ఒంగోలులో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.
బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్కు చెందిన సంజీవ కుమార్ ఒంగోలు రైల్వే స్టేషన్కు అతి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న GRPS పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.