News March 13, 2025
SKLM: ప్రశాంత వాతావరణంలో పది పరీక్షలు జరగాలి

మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఏపీ CS కె.విజయానంద్ కలెక్టర్ను ఆదేశించారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్చువల్గా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరయ్యారు. 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నిర్వహించాలన్నారు.
Similar News
News March 22, 2026
శ్రీకాకుళం జిల్లాలోని బీసీ హాస్టల్స్ అప్డేట్

శ్రీకాకుళం జిల్లాలో 81 బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలుండగా 56 ప్రభుత్వ, 25 ప్రైవేట్ భవనాల్లో సుమారు 6,800 మంది విద్యార్థులున్నారు. ఈ గృహాల్లో ఆర్ఓ ప్లాంట్లు, మరుగుదొడ్లు, పవర్ కట్ సమయంలో ఇబ్బంది లేకుండా ఇన్వర్టర్లు, పక్కా మెనూ, కొత్త నిర్మాణాలు నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోట్లల్లో నిధులను వెచ్చించనుంది. విద్యార్థులకు ప్రత్యేక వసతుల కల్పనపై దృష్టి పెట్టినట్లు బీసీ సంక్షేమ శాఖాధికారి అనురాధ చెప్పారు.
News March 22, 2026
అంబేడ్కర్ వర్సిటీకి పాలక మండలి లేదా?

ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పాలకమండలి లేదా? అన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. 2022 నవంబర్ తర్వాత పాలకమండలి సమావేశం జరగలేదు. పాలకమండలిలో 12 మంది సభ్యులు ఉంటారు, ఏడుగురు అత్యవసర సభ్యులు. కాగా ఆరు నెలలకు ఓసారి కచ్చితంగా మండలి సమావేశం జరగాలి. అయితే అలా జరగడం లేదు. దీంతో పాలన గాడి తప్పిందనే అభిప్రాయాన్ని విద్యార్థులు, మేధావులు వ్యక్తం చేస్తున్నారు.
News March 22, 2026
శ్రీకాకుళం: కమర్షియల్ గ్యాస్ కొరత… మూతపడుతున్న హోటల్స్

శ్రీకాకుళం నగరం, ఆమదాలవలస, పలాస కాశిబుగ్గ, ఇచ్చాపురం వంటి పట్టణాలు, నరసన్నపేట, పొందూరు వంటి ప్రాంతాల్లో కమర్షియల్ గ్యాస్ కొరత సమస్యగా మారింది. దీంతో హోటల్లో మూతపడుతున్నాయి. జిల్లాలో 400 వరకు హోటల్స్ ఉన్నాయి. హోటళ్ల సంక్షోభం అల్పాహారం, భోజనం కోసం ఆధారపడే వారితోపాటు, హోటల్లో పనిచేస్తున్న వారిపై సైతం ప్రభావం చూపుతుంది. డొమెస్టిక్ గ్యాస్ సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.


