News March 13, 2025
సంగారెడ్డి: చదివితే ఉజ్వల భవిష్యత్తు: కలెక్టర్

కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు 10 జీపీఏ సాధించేందుకు కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారి విద్యాసాగర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Similar News
News April 18, 2026
‘అల్లూరి జిల్లాలో పాఠశాలలకు మౌలిక వసతులు కల్పిస్తాం’

ఉమ్మడి అల్లూరి జిల్లాలో అన్ని పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి జరుగుతుందని సర్వశిక్ష జిల్లా అధికారి స్వామి నాయుడు అన్నారు. రంపచోడవరంలో విద్యాశాఖ అధికారులతో శనివారం సమావేశం జరిగింది. జిల్లాలో ఏ పాఠశాలలకు భవనాలు, మరుగుదొడ్లు, నీరు తదితర సదుపాయాలు అవసరమో నివేదిక అందజేయాలని MEOలను ఆయన ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్య, ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు పాల్గొన్నారు.
News April 18, 2026
చిన్నారి పునర్విక చికిత్సపై TDP స్పష్టత

అరుదైన SMA టైప్-1 వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక చికిత్సకు మంత్రి నారా లోకేశ్ రూ.6 కోట్లు స్వయంగా అందించిన విషయంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని టీడీపీ Xలో ట్వీట్ చేసింది. మొత్తం రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం దాతలు రూ.10 కోట్లు సమకూర్చగా, మిగతా మొత్తాన్ని లోకేశ్ భరించారని రాసుకొచ్చింది. CMRF నిధులు ఉపయోగించలేదని స్పష్టం చేస్తూ తప్పుడు ప్రచారాన్ని Xలో ఖండించింది.
News April 18, 2026
నేర నియంత్రణే లక్ష్యం: జిల్లా ఎస్పీ

పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఎస్పీ సతీశ్ కుమార్ శనివారం జిల్లాస్థాయి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులు విజిబుల్ పోలీసింగ్ పెంచాలని, రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. సమాజానికి హాని కలిగించే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని స్పష్టం చేశారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను అభినందించారు.


