News March 23, 2024
ప.గో.: లెక్క తేలింది.. 6 చోట్ల జనసేన.. 9 చోట్ల టీడీపీ

ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థులు ఎట్టకేలకు ఖరారయ్యారు. పోలవరం టికెట్పై జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు కేటాయించగా.. కొద్ది రోజులుగా ఉన్న సందిగ్ధత వీడింది. పొత్తులో భాగంగా 6 స్థానాల్లో జనసేన, 9 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీకి పోటీ చేసే అవకాశం రాలేదు. మరి కూటమి అభ్యర్థులు ఎన్నింట విజయం సాధించేనో చూడాలి మరి.
Similar News
News April 24, 2025
ప.గో జిల్లా టాపర్ ఈ బాలికే..!

నరసాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం మహాత్మా జ్యోతీ బా పూలే గురుకుల పాఠశాల (బాలికలు)విద్యార్థులు పదో తరగతి ఫలితాలలో ప్రతిభ చూపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని రావి అశ్విని 592 మార్కులు సాధించి జిల్లాస్థాయిలో సాధించి ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ సీహెచ్ కె. శైలజ తెలిపారు. పెరవలి గ్రామానికి చెందిన అశ్విని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ ఉంటారు.
News April 24, 2025
పాలకోడేరు : ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. కేసు

పాలకోడేరు మండలం మోగల్లు వశిష్ట మెరైన్స్ ఆక్వా పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీకై మంగళవారం ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు పలువురు అస్వస్థతకు గురవ్వగా, మరికొంత మంది ఊపిరాడక బయటకు పరుగులు తీసేటప్పుడు గాయాలపాలయ్యారు. దీనిపై ఓ మహిళా కార్మికురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పాలకోడేరు స్టేషన్ రైటర్ నాగరాజు తెలిపారు.
News April 24, 2025
బాలిక మిస్సింగ్ కేసు చేధించిన భీమవరం పోలీసులు

భీమవరం టూ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలో 14 సంవత్సరాల బాలిక మిస్సింగ్ కేసును సాంకేతిక పరిజ్ఞానంతో చేధించారు. సీఐ కాళీ చరణ్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలిక విశాఖపట్నం ట్రైన్ లో వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ పోలీసులకు సమాచారం అందించగా బాలికను గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.