News March 13, 2025

TRAIN HIJACK: బందీలు విడుదల

image

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్‌లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.

Similar News

News November 1, 2025

ఉప్పు వేయడం, వేర్లు నరకడం వల్ల కొబ్బరి దిగుబడి పెరుగుతుందా?

image

చాలా చోట్ల కొబ్బరి సాగు చేస్తున్న రైతులు చెట్లకు ఉప్పు వేయడం, వేర్లు నరకడం చేస్తుంటారు. దీని వల్ల దిగుబడి పెరుగుతుందని కొందరు చెబుతుంటారు. ఏడాది వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఏడాది దిగుబడి కొంత పెరగడం కనిపిస్తుంది. కానీ తర్వాత ఏడాది నుంచి దిగుబడి తగ్గిపోతుంది. అది చెట్టుకు కూడా హాని చేస్తుంది. ఇది అశాస్త్రీయమైన పద్ధతి అని, దీన్ని పాటించకపోవడం మంచిదని ఉద్యాన పరిశోధనా నిపుణులు చెబుతున్నారు.

News November 1, 2025

నేటి నుంచి చెస్ వరల్డ్ కప్

image

గోవా వేదికగా నేటి నుంచి ఈనెల 27 వరకు FIDE చెస్ వరల్డ్ కప్ జరగనుంది. వివిధ దేశాల నుంచి మొత్తం 206 మంది ప్లేయర్లు పాల్గొననున్నారు. చివరగా 2002లో భారత్ WCని హోస్ట్ చేసినప్పుడు విశ్వనాథన్ ఆనంద్ ఛాంపియన్‌గా నిలిచారు. ఆయనను గౌరవిస్తూ ఈ ఏడాది WCకి ఆనంద్ ట్రోఫీ అని పేరు పెట్టారు. IND నుంచి ప్రజ్ఞానంద, అర్జున్, గుకేశ్ తదితర ప్లేయర్లు పాల్గొననుండగా, కార్ల్‌సన్, కరువానా, నకమురా ఈ టోర్నీలో పాల్గొనట్లేదు.

News November 1, 2025

మన ఆచారం ప్రకారం.. చెవిలో నూనె చుక్కలు ఎందుకు వేసుకుంటారు?

image

దీపావళి వంటి కొన్ని పండుగలప్పుడు రెండు, మూడు నూనె చుక్కలను చెవిలో వేసుకునే ఆచారం ఎప్పటి నుంచో ఉంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. ఇది చాలా శ్రేష్ఠం. ఈ కర్ణాభ్యంగం అన్ని చెవి సమస్యలతో పాటు మెడ బిగిసిపోవడం, దౌడ బిగిసిపోవడం, చెవిలో శబ్దం వంటి సమస్యలు దరిచేరనివ్వదు. ఫలితంగా చెవులకు, పాదాలకు చల్లదనం కలిగి, ఒత్తిడి తగ్గి శరీరానికి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యకరమైన శ్రవణ వ్యవస్థ కోసం దీన్ని పాటించడం మంచిది.