News March 13, 2025

సిద్దిపేట: 14 నుంచి 29 వరకు అన్ని బంద్: సీపీ

image

అనుమతులు లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేపట్టవద్దని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 14 నుంచి 29 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధించినట్లు తెలిపారు. డీజేలు సైతం నిషేధించినట్లు సీపీ తెలిపారు.

Similar News

News September 15, 2025

కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్య.. జైలుకు నిందితులు

image

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్‌లేక్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన రేణు అగర్వాల్ హత్యకేసులో కీలక పరిణామం జరిగింది. రాంచీ నుంచి నిందితులు హర్ష, రోషన్, రాజ్ వర్మను పోలీసులు కూకట్‌పల్లికి తీసుకొచ్చారు. ట్రాన్సిట్ వారెంట్‌పై స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది. కంది జైలుకు తరలించినట్లు సమాచారం.

News September 15, 2025

మెదక్: అట్టహాసంగా ఉమ్మడి జిల్లా కరాటే పోటీలు

image

పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి 14 సంవత్సరాలులోపు బాలబాలికలకు
కరాటే పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల నుంచి 85 మంది బాలురు, 75 మంది బాలికలు మొత్తం 160 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఎస్.జి.ఎఫ్ కార్యదర్శి నాగరాజు, పీఈటీల సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు, శ్రీధర్ రెడ్డి, పీడీలు ప్రతాప్ సింగ్, మాధవా రెడ్డి, పూర్ణచందర్ ఉన్నారు.

News September 15, 2025

ప్రజావాణిలో 90 దరఖాస్తులు స్వీకరణ: కలెక్టర్

image

జనగామలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 90 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ప్రజా విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాని అన్నారు. ప్రజావాణితో ఎంతో మంది సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజావాణిలో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. అదనపు కలెక్టర్లు బెన్షా లోమ్, పింకేశ్ కుమార్ పాల్గొన్నారు.