News March 13, 2025
మల్దకల్: పట్టు వదలని విక్రమార్కుడు 4 ఉద్యోగాలు సాధించాడు

మల్దకల్ మం. ఎల్కూరుకి చెందిన నిరుపేద రైతు కూలి బిడ్డ మహమ్మద్ సుభాన్ 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ధరూర్ మం.లో 2014లో పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాడు. 2024లో ప్రభుత్వ గురుకుల పాఠశాల టీచర్, జూనియర్ లెక్చరర్గా ఉద్యోగాలు సాధించాడు. 2023లో టీజీపీఎస్సీ నిర్వహించిన జూనియర్ లెక్చరర్ల రాతపరీక్షలో ప్రతిభ చాటి ఫిజిక్స్ లెక్చరర్గా ఉద్యోగం సంపాదించాడు. ఈ మేరకు నియామకపత్రాన్ని సీఎం చేతుల మీదుగా అందుకున్నారు.
Similar News
News March 24, 2026
ముంబైకి సూర్యను కెప్టెన్ చేయాలి: అశ్విన్

MI కెప్టెన్సీని సూర్యకు అప్పగించాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల <<19453220>>మాజీ క్రికెటర్ శ్రీకాంత్<<>>, తాజాగా అశ్విన్ ఇవే కామెంట్స్ చేశారు. ‘హార్దిక్ మంచి నాయకుడే. కానీ MIకి వచ్చాక తొలి ఏడాది రోహిత్ వ్యవహారంతో గడిచిపోయింది. ప్రస్తుతం భారత T20 జట్టు కెప్టెన్ సూర్య IPLలో హార్దిక్ నాయకత్వంలో ఆడాలి. ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.
* MI కెప్టెన్గా ఎవరు బెటర్? కామెంట్ చేయండి.
News March 24, 2026
రూపాయి లాభం లేక.. రోజుకు రూ. కోట్లలో నష్టం

అంతర్జాతీయంగా యుద్ధ ప్రభావం, ఎగుమతులు నిలిచిపోవడంతో ఉమ్మడి జిల్లాలో కోడిగుడ్డు ధరలు పతనమై పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. ఒక్కో గుడ్డు ఉత్పత్తికి రూ.4.60 ఖర్చవుతుండగా, మార్కెట్లో కేవలం రూ.3.50 మాత్రమే పలుకుతుండటంతో రైతులకు ఒక్కో గుడ్డుపై రూ. 1.10 నష్టం వాటిల్లుతోంది. సుమారు 2000 పౌల్ట్రీ ఫామ్లలో ఉన్న 2 కోట్ల కోళ్ల ద్వారా రోజూ జరిగే ఉత్పత్తిపై రైతులకు నిత్యం రూ.కోట్లలో నష్టం వస్తోంది.
News March 24, 2026
తగ్గేదే లే.. యుద్ధం కొనసాగుతుంది: నెతన్యాహు

పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్పై దాడులకు US అధ్యక్షుడు ట్రంప్ బ్రేక్ ఇచ్చినా తాము మాత్రం ఆగేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్, లెబనాన్పై దాడులు కొనసాగుతాయన్నారు. కాగా దాడుల్లో సాధించిన విజయాలే డీల్లో పైచేయి సాధించడానికి కీలకం అవుతాయని భావిస్తున్నట్లు ట్రంప్ తనతో చెప్పారని తెలిపారు.


