News March 13, 2025

నేటి నుంచి 5 రోజులు జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో నేటి నుంచి 18 వరకు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, గద్వాల్, నారాయణ్ పేట్ జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది.

Similar News

News March 13, 2025

జర్నలిస్టుల అరెస్ట్‌పై కపిల్ సిబల్ అసహనం.. పూనమ్ రిప్లై!

image

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను పోస్ట్ చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తప్పుబట్టారు. ఇలా అరెస్టులు చేయడం పరిష్కారం కాదని, ఇది అంటువ్యాధిలాంటిదని మండిపడ్డారు. ఈ చర్యపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌కు సినీ నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ.. ‘ఆమె ఇతర మహిళలకు పరువు నష్టం కలిగించడమే అజెండాగా పనిచేస్తుంది. నేనూ ఆమె బాధితురాలినే’ అని పేర్కొన్నారు.

News March 13, 2025

అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్: హరీశ్

image

TG: CM రేవంత్ అసెంబ్లీలో, బయటా అసత్యాలే మాట్లాడుతున్నారని, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని హరీశ్ రావు విమర్శించారు. TVVP డాక్టర్లు, నర్సులు, హోం గార్డులు సహా ఇతర సిబ్బందికి వెంటనే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ’13 రోజులు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖలోని TVVP సిబ్బందికి జీతాలు చెల్లించలేదు. పోలీసు శాఖలోనూ ఇదే దుస్థితి. దుష్ప్రచారంతో ఇంకెంత కాలం వెళ్లదీస్తారు?’ అని ప్రశ్నించారు.

News March 13, 2025

చేతిలో రూ.12 లక్షల విలువైన షేర్లు.. కానీ!

image

రతన్ అనే వ్యక్తికి 1992లో తన తండ్రి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కొన్న <<15725743>>షేర్స్<<>> అగ్రిమెంట్ పేపర్స్ దొరికిన విషయం తెలిసిందే. వీటి విలువ దాదాపు రూ.12లక్షలు అయినప్పటికీ షేర్స్‌ను డిజిటలైజ్ చేసేందుకు ఆయన ఇష్టపడట్లేదు. ‘డిజిటలైజ్ చేసేందుకు మూడేళ్లు పట్టేలా ఉంది. కేవలం వారసుడిగా సర్టిఫికెట్ పొందేందుకే 8నెలలు పడుతుంది. ఇంత సమయాన్ని దీనికోసం వృథా చేయను. ఇండియాలో ఈ ప్రక్రియ వ్యవధిని తగ్గించాలి’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!