News March 13, 2025
సిద్దిపేట: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

2025-26 విద్యాసంవత్సరానికి గాను సిద్దిపేట జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన ఖాళీ సీట్లు భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 20 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. నియమ నిబంధనలకు లోబడి రిజర్వేషన్ల పద్ధతిలో విద్యార్థుల ఎంపిక ఉంటుందన్నారు.
Similar News
News March 13, 2025
పోతారు.. మొత్తం పోతారు: యూఎన్ చీఫ్ హెచ్చరిక

దేశాలు వాణిజ్య యుద్ధాల్లోకి దిగడం ఎవరికీ మంచిది కాదని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. సుంకాల పోరు అన్ని దేశాలనూ దెబ్బ కొడుతుందని పేర్కొన్నారు. ‘మనం నేటికాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బతుకుతున్నాం. అన్ని దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. స్వేచ్ఛాయుత వాణిజ్యం అందరికీ ఉపయోగం. అదే వాణిజ్య యుద్ధంలోకి వెళ్తే విజేతలెవరూ ఉండరు’ అని స్పష్టం చేశారు.
News March 13, 2025
ప్రకృతి ఇచ్చిన రంగులతో హోలీ జరుపుకోండి

హోలీ సందర్భంగా వాడే కృత్రిమ రంగులతో<<15741783>> చర్మ<<>>సమస్యలతో పాటు కంటికి ప్రమాదం. కనుక ఇంటి వద్ద లభించే వస్తువులతోనే రంగులు తయారు చేయవచ్చు. పసుపులో కొంత శనగపిండి కలిపితే రంగుగా మారుతోంది. ఎర్ర మందారం బియ్యంపిండి, కుంకుమపువ్వు కలపాలి. ఆకులను ఎండబెట్టి గ్రైండర్ పడితే గ్రీన్ కలర్ రెడీ. గులాబీ రేకులను పొడిగా చేసుకొని రుబ్బితే సరిపోతుంది. వీటితో పాటు కంటికి అద్దాలను ధరిస్తే ఎటువంటి ప్రమాదం ఉండదు.
News March 13, 2025
అనకాపల్లి: రేపు జడ్పీ స్థాయి సంఘం సమావేశాలు

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు ఈనెల 15వ తేదీన నిర్వహించనున్నట్లు సీఈఓ నారాయణమూర్తి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.జడ్పీ చైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన సమావేశాలు జరుగుతాయన్నారు.విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి స్థాయి సంఘాల సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.జడ్పిటిసిలు, ఎంపీపీలు జిల్లా స్థాయి అధికారులు సమావేశానికి హాజరుకావాలని కోరారు.