News March 13, 2025
మెదక్లో మహిళలు మిస్..

మెదక్ పట్టణంలో ఇద్దరు మహిళలు తప్పిపోయారు. వీరిలో… పాపన్నపేట్ మండలం ఎంకేపల్లి చెందిన కందెం నర్సమ్మ (50) ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అలాగే మెదక్ పట్టణానికి చెందిన నీరుడి కిష్టమ్మ (68) అదృశ్యమైంది. ఆమె మతిస్థిమితం సరిగ్గా లేదని తెలిపారు. ఇరువురు కుటుంబ సభ్యులు మెదక్ టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. పైన తప్పిపోయిన వారి ఆచూకీ లభిస్తే మెదక్ టౌన్ పీఎస్లో తెలపాలని ఇన్స్పెక్టర్ నాగరాజు సూచించారు.
Similar News
News December 31, 2025
మెదక్ జిల్లాలో మహిళల భద్రతకు షీటీమ్స్: ఎస్పీ

మెదక్ జిల్లాలో మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ పటిష్టంగా పనిచేస్తున్నాయని ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. డిసెంబర్లో ఈవ్ టీజింగ్ కేసుల్లో 2 ఎఫ్ఐఆర్లు, 7 పెట్టి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 64 మందికి కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. కళాశాలలు, పాఠశాలలు, రద్దీ ప్రాంతాల్లో 38 అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వేధింపులకు గురైతే 100 లేదా షీ టీమ్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News December 30, 2025
BIG BREAKING: మెదక్: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

TGలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా మొదలైంది. ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు మెదక్ జిల్లాలోని నర్సాపూర్, రామాయంపేట, మెదక్, తూప్రాన్ మున్సిపాలిటీల కమిషనర్లతో నిర్వహించిన VCలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి. SHARE IT
News December 30, 2025
జవాబుదారీతనం పెంచడానికి సమాచార హక్కు చట్టం కీలకం: మెదక్ అదనపు కలెక్టర్

పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి సమాచార హక్కు చట్టం కీలకమని అదనపు కలెక్టర్ మెంచు నగేశ్ అన్నారు. సమాచార హక్కు చట్టం-2005పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పౌరులకు చట్టం విధానాలు, దరఖాస్తు ప్రక్రియ, సమాచారం పొందే హక్కులు గురించి వివరంగా తెలియజేశారు. పౌర సమాచార అధికారులు (PIO), సహాయ PIOలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. చట్టం ప్రకారం 30 రోజుల్లో సమాచారం అందించాలన్నారు.


