News March 13, 2025
త్రిభాష విధానానికి సుధామూర్తి మద్దతు

జాతీయ విద్యా విధానంలోని త్రీ లాంగ్వేజ్ పాలసీకి ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి భార్య, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి మద్దతు తెలిపారు. దీంతో పిల్లలు చాలా నేర్చుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తనకు ఏడెనిమిది భాషలు తెలుసని చెప్పారు. కాగా ఈ విధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం కావాలనే తమపై మూడో భాషను రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తోంది.
Similar News
News March 13, 2025
పాత సామాను బయటికెళ్లాలి: రాజాసింగ్

TG: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే పాత సామాను పార్టీ నుంచి బయటికెళ్లి పోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే వాళ్లతో రహస్యంగా భేటీ అవుతున్నారు. గొప్పలు చెప్పుకునేవాళ్లకు రిటైర్మెంట్ ఇస్తేనే బీజేపీకి మంచి రోజులు. దీనిపై జాతీయ నాయకత్వం కూడా ఆలోచన చేయాలి. నేనొక్కడినే కాదు.. ప్రతి బీజేపీ కార్యకర్త ఇదే కోరుకుంటున్నాడు’ అని వ్యాఖ్యానించారు.
News March 13, 2025
రష్మిక సంచలనం.. రెండేళ్లలో ₹3,300 కోట్లు!

సినీ పరిశ్రమలో రష్మిక మందన్నా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారారు. యానిమల్, పుష్ప-2, ఛావా సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టడమే ఇందుకు కారణం. గత రెండేళ్లలో రష్మిక నటించిన సినిమాలు వరల్డ్ వైడ్గా ₹3,300 కోట్లు వసూలు చేశాయి. హిందీలోనే దాదాపు ₹1850కోట్లు రాబట్టాయి. దీంతో దీపిక, అలియా భట్ వంటి స్టార్ల కంటే రష్మికకే ఎక్కువ సక్సెస్ దక్కింది. ప్రస్తుతం ఆమె సల్మాన్ ‘సికందర్’, ధనుష్ ‘కుబేర’లో నటిస్తున్నారు.
News March 13, 2025
SSMB29పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన ఒడిశా డిప్యూటీ సీఎం

సూపర్ స్టార్ మహేశ్బాబు ‘SSMB29’ సినిమా షూటింగ్పై ఒడిశా డిప్యూటీ CM ప్రవతి పరిద అప్డేట్ ఇచ్చారు. ‘గతంలో ‘పుష్ప-2’, ఇప్పుడు రాజమౌళిలాంటి స్టార్ డైరెక్టర్ తీస్తోన్న SSMB29 షూటింగ్నూ ఒడిశాలో జరుపుతుండటం సంతోషం. ప్రస్తుతం కోరాపుట్లో మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాలతో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇవి ఒడిశా టూరిజానికి ఊపునిస్తాయి. షూటింగ్లకు ప్రధాన గమ్యస్థానంగా మారుతుంది’ అని పేర్కొన్నారు.