News March 13, 2025
జూన్ నాటికి అర్హులకు 5 లక్షల ఇళ్లు: మంత్రి

AP: రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి అర్హులకు ఇస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఉపయోగించిందని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక 1.25 లక్షల నిర్మాణాలు పూర్తి చేశామని, మిగిలిన 7.25 లక్షల గృహ నిర్మాణాలను 2026 మార్చిలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News March 16, 2026
గ్యాస్ వినియోగదారులకు డిస్కౌంట్లు

LPGకి హైడిమాండ్ నెలకొన్న వేళ PNG కనెక్షన్లకు ప్రజలను ఆకర్షించేందుకు గ్యాస్ సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. MAR 31లోగా రిజిస్టరయ్యే డొమెస్టిక్ యూజర్లకు GAIL, ఇంద్రప్రస్థ గ్యాస్ సంస్థలు ₹500 విలువైన ఫ్రీ గ్యాస్ అందించనున్నాయి. మహానగర్ గ్యాస్.. కమర్షియల్ కనెక్షన్ల సెక్యూరిటీ డిపాజిట్ (₹1L-5L), డొమెస్టిక్ రిజిస్ట్రేషన్ ఫీ (₹500)పై మినహాయింపు ఇచ్చింది. BPCL కూడా కమర్షియల్పై జీరో డిపాజిట్ ప్రకటించింది.
News March 16, 2026
జూన్ నెల శ్రీవారి దర్శన కోటా టికెట్ల వివరాలు

☛ ఈ నెల 18 నుంచి 20 వరకు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్
☛ 21న శ్రీవారి ఆర్జిత సేవా, వర్చువల్ ఆర్జిత సేవా టోకెన్ల విడుదల
☛ 23న 10AMకి అంగప్రదక్షిణం ఫ్రీ టికెట్స్, 11AMకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఆన్లైన్ కోటా, 3PMకి సీనియర్ సిటిజన్, దివ్యాంగుల కోటా
☛ 24న 10AMకి స్పెషల్ ఎంట్రీ (₹300) దర్శనం టికెట్లు, 3 PM నుంచి గదుల కోటా
News March 16, 2026
రూ.3లక్షల కోట్లకు పైగా బడ్జెట్… చర్చ 6 రోజులే!

TG: అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ కుదించుకుపోతోంది. FY25-26లో ₹3.04L కోట్ల బడ్జెట్ పెట్టగా సభ 11 రోజులు జరిగింది. GOVR ప్రసంగం, ధన్యవాదాలు, బడ్జెట్ ప్రవేశానికి 4రోజులు పోను బడ్జెట్పై చర్చ 7రోజుల్లో ముగిసింది. ఈసారి బడ్జెట్ గతం కన్నా పెరిగే అవకాశముంది. ప్రస్తుత సమావేశాలు ఈనెల 30వరకు ఉంటాయి. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి, ఆదివారాలు పోను మొత్తం పనిదినాలు 10 రోజులే. అందులో బడ్జెట్పై చర్చించేది 6 రోజులే.


