News March 13, 2025
దోమ: ఘోర రోడ్డు ప్రమాదం.. హాస్పిటల్కు తరలింపు

దోమ మండలం మైలారం గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొడుగోనిపల్లి నుంచి మోత్కూర్ వెళ్లే రోడ్డులో కోళ్ల ఫారం దగ్గర మోత్కూర్ గ్రామానికి చెందిన సండి సాయికుమార్, ధన్ రాజ్ అనే వ్యక్తులు బైక్తో ట్రాక్టర్కు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పరిగి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించగా.. అక్కడి నుంచి వికారాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
Similar News
News March 13, 2025
ఆంధ్రప్రదేశ్-తెలంగాణను కలిపే వంతెనపై ప్రజల్లో ఆశాభావం

అమ్రాబాద్-పదర మండలాలను కలిపే కృష్ణా నదిపై వంతెన నిర్మాణం నల్లమల ప్రజలకు దశాబ్దాల కల. మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో ఈ వంతెన నిర్మాణం జరిగితే, వాణిజ్య, వ్యవసాయ, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తావన వచ్చినా అమలు కాలేదు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి స్వస్థలం NGKL జిల్లా కావడంతో, 30ఏళ్ల కల నెరవేరుతుందన్న ఆశ ప్రజల్లో వ్యక్తమౌతోంది.
News March 13, 2025
HCUకు ఉత్తమ యూనివర్సిటీగా గుర్తింపు

ప్రముఖ యూనివర్సిటీ HCUకు అరుదైన గుర్తింపు లభించింది. లండన్కు చెందిన క్యూఎస్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలపై స్టడీ నిర్వహించి ర్యాంకింగ్స్ విడుదల చేసింది. 1700 విశ్వవిద్యాలయాల్లో సర్వే చేయగా ఏడు సబ్జెక్టుల్లో ర్యాంక్ పొందింది. లింగ్విస్టిక్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్, సోషియోలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, బయోలాజికల్ సైన్స్లో ఉత్తమ ర్యాంకులను సాధించింది.
News March 13, 2025
నల్గొండ: హోలీ ప్రశాంతంగా జరుపుకోవాలి: SP

హోళీ వేడుకలు ఇతరులకు హాని కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆకతాయిల కోసం షీ టీమ్ బృందాల నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని అన్నారు. హోలీ వేడుకలలో అల్లరి సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.