News March 13, 2025
ఉద్యోగులకు గుడ్ న్యూస్?

AP: ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ గద్దె దిగే సమయానికి రూ.25వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని కూటమి ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెలాఖరు నాటికి జీపీఎఫ్, రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో రూ.4-5 వేల కోట్ల వరకు చెల్లించాలని చూస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఈ చెల్లింపులకు ఉపయోగిస్తామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.
Similar News
News March 27, 2026
రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పెంపు

రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను కేంద్ర ప్రభుత్వం 50% నుంచి 70%కి పెంచింది. ఈ మేరకు రాష్ట్రాలకు పెట్రోలియం శాఖ లేఖలు రాసింది. ఉక్కు, రసాయనాలు, ఆటో మొబైల్స్, వస్త్రాలు, రంగుల వంటి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ప్రీ క్రైసిస్ కోటాను 40% నుంచి 50%కి పెంచింది. మరోవైపు దేశంలో యూరియా కొరత లేదని, సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.
News March 27, 2026
IPL జట్లకు ఆదాయం ఎలా వస్తుంది? ఏ టీమ్ ఎక్కువ సంపాదించింది?

IPLలోని 10 జట్లకు యాడ్స్, మీడియా రైట్స్, స్పాన్సర్షిప్స్, టికెట్ విక్రయాల ద్వారా ఆదాయం వస్తుంది. దేశ, విదేశాల్లో ఆడే టోర్నమెంట్స్ వల్ల ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. IPL, ILT20, మేజర్ క్రికెట్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడే KKR 2025లో అత్యధికంగా ₹756Cr సంపాదించింది. తర్వాతి స్థానాల్లో CSK(₹674Cr), MI(₹665Cr), SRH(₹642Cr), RR(₹635Cr), DC(₹603Cr), GT(₹559Cr), RCB(₹504Cr), PBKS(₹471Cr) ఉన్నాయి.
News March 27, 2026
ఇజ్రాయెల్కు పాకిస్థాన్ వార్నింగ్

టెహ్రాన్(ఇరాన్)లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి అత్యంత సమీపంలో అమెరికా-ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై పాక్ తీవ్రంగా స్పందించింది. ‘మాది ఖతర్ లాంటి దేశం కాదని ఇజ్రాయెల్ గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఎక్కడైనా మా దౌత్యవేత్తలకు హాని జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయి’ అని హెచ్చరించింది. కాగా ఈ దాడుల్లో దౌత్యవేత్తలకు ఎలాంటి హాని కలగలేదు. పలు భవనాలు ధ్వంసమయ్యాయి.


