News March 13, 2025

జైనథ్: నలుగురు యువకులపై కేసు : SI

image

బెదిరింపులకు గురిచేసిన యువకులపై కేసు నమోదు చేసినట్లు జైనథ్‌ ఎస్‌ఐ పురుషోత్తం తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. ADBకు చెందిన రాకేశ్, సచిన్, కార్తీక్, సాత్వీక్‌‌లు ఎలాంటి అధికారం లేకుండా మంగళవారం అర్ధరాత్రి భోరజ్‌ చెక్‌పోస్టు వద్ద హైవేపై ఎద్దుల లారీలను అక్రమంగా అడ్డుకున్నారు. లారీ డ్రైవర్లు సందీప్‌ గోకులే, సాహిల్‌‌లను బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేశారన్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Similar News

News March 14, 2025

BREAKING: ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

హోలీ పండుగ వేళ ఆదిలాబాద్‌లో విషాదం జరిగింది. పట్టణంలోని ఎరోడ్రం సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళుతుండగా ఇద్దరు కిందపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారిని రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో రిషి కుమార్ అనే యువకుడు మృతిచెందగా.. మరో యువకుడు ప్రేమ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని సీఐ సునీల్ కుమార్ సందర్శించి దర్యాప్తు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 14, 2025

ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆదిలాబాద్ SP

image

ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు SP అఖిల్ మహాజన్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సూచనలు చేశారు.★ వాహనాలు నడిపే వారిపై రంగులు చల్లుతూ ఇబ్బందులు కలిగించకూడదు★ ఇతరుల అనుమతి లేకుండా రంగులను పూయరాదు★ మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు★ సహజసిద్ధమైన రంగులను ఉపయోగించడం శ్రేయస్కరం★ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు

News March 14, 2025

ఆదిలాబాద్: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

image

విద్యా శాఖ కార్యదర్శి (FLN) విద్యార్థుల్లో అభ్యాస సామర్థ్యాలను బలోపేతం చేసే అంశంపై గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో, విద్యాధికారులతో, నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. AI ఆధారిత పరిజ్ఞానంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో వెనుకబడి ఉన్న విద్యార్ధులకు సులువుగా శ్రద్ధతో చదవడానికి పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.

error: Content is protected !!