News March 13, 2025
మచిలీపట్నంలో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు

మచిలీపట్నంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పోలీస్ కంట్రోల్ రూమ్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న వెంకటేశ్వరరావు రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వెళ్తున్న లారీ కాలును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన కుడి కాలు పాద భాగం నుజ్జు నుజ్జైంది. క్షతగాత్రుడిని వెంటనే మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 14, 2025
కృష్ణా: ఈనెల 17 నుంచి 10th exams

మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు తెలిపారు. గురువారం మచిలీపట్నం కలెక్టరేట్లో విద్యాశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు.
News March 13, 2025
జగన్తో కృష్ణాజిల్లా వైసీపీ నేతల భేటీ

మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని నాయకత్వంలో జిల్లాలోని ఆ పార్టీ నేతలు గురువారం తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ని కలిశారు. యువత పోరు పేరుతో కలెక్టరేట్ వద్ద బుధవారం జరిగిన ధర్నా విజయవంతం అయిన తీరు, జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను జగన్కు వివరించారు. జగన్ని కలిసిన వారిలో సింహాద్రి రమేష్, కైలే అనిల్, ఉప్పాల రాము, పేర్ని కిట్టు తదితరులు ఉన్నారు.
News March 13, 2025
బోరగడ్డ అనిల్ను మచిలీపట్నం తీసుకురానున్న పోలీసులు

YCP నేత బోరుగడ్డ అనిల్పై చిలకలపూడి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై దూషణ కేసులో అనిల్ కుమార్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఆయనపై గతంలో చిలకలపూడి PSలో 2 కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పీటీ వారెంట్ జారీ చేశారు. దీంతో రాజమండ్రి నుంచి కాసేపటి క్రితం అనిల్ను ఇక్కడకు తీసుకొచ్చారు.