News March 13, 2025
పార్వతీపురం: నేడు ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు

పార్వతీపురం మన్యంలో గురువారం ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. వడగాల్పుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
Similar News
News July 5, 2025
JGTL: ఫ్రెండ్స్ అవమానించారని విద్యార్థిని సూసైడ్

జగిత్యాల జిల్లా జాబితాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాటిపెల్లి నిత్య(21) HYD KPHB కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ B.TECH థర్డ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో చదువులో వెనుకబడ్డావంటూ ఇద్దరు స్నేహితులు నిత్యను అవమానించారు. రెండ్రోజుల క్రితం ఇంటికి వెళ్లిన నిత్య గడ్డి మందు తాగింది. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. కేసు నమోదైంది.
News July 5, 2025
రేపు కుక్కలకు ఉచితంగా యాంటీరేబీస్ టీకాలు

AP: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా రేపు కుక్కలకు ఉచితంగా యాంటీరేబిస్ టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ తెలిపింది. పశువైద్యశాలలు, ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు, పాలీ క్లినిక్స్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఇవి అందించనున్నారు. ఇందుకోసం 5.37 లక్షల టీకాలను సిద్ధం చేశారు. జంతువుల నుంచి మనుషులకు లేదా మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు.
News July 5, 2025
రాజమండ్రిలో మహిళ హత్య.. ముగ్గురికి జీవిత ఖైదు

రాజమండ్రికి చెందిన మహిళ హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు పడింది. 2013 డిసెంబర్ 2న లక్ష్మీవారపు పేటకు చెందిన నాగభారతిని మహేశ్, లక్ష్మణరావు, మరో వ్యక్తి బంగారం కోసం హత్య చేశారు. మహిళ భర్త ప్రసాదరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వాదనలు విన్న పదో అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు కమ్ ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఉమశునంద ముగ్గురు హత్య చేశారని నిర్ధారించి శుక్రవారం తీర్పు చెప్పారు.