News March 13, 2025

పార్వతీపురం: నేడు ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు

image

పార్వతీపురం మన్యంలో గురువారం ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. వడగాల్పుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

Similar News

News March 13, 2025

ఇతరులకు ఇబ్బంది లేకుండా హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

image

హోలీ పండుగను ఇతరులకు ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రజలకు సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా అవాంఛనీయ ఘటనలను ప్రేరేపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

News March 13, 2025

నిర్మల్‌ జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

image

నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పండుగను సంతోషాల నడుమ జరుపుకోవాలని కోరారు. సహజ రంగులను వాడాలని సూచించారు. బైక్‌లపై వేగంగా వెళ్లవద్దని, యువత ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.

News March 13, 2025

ఆంధ్రప్రదేశ్-తెలంగాణను కలిపే వంతెనపై ప్రజల్లో ఆశాభావం

image

అమ్రాబాద్-పదర మండలాలను కలిపే కృష్ణా నదిపై వంతెన నిర్మాణం నల్లమల ప్రజలకు దశాబ్దాల కల. మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో ఈ వంతెన నిర్మాణం జరిగితే, వాణిజ్య, వ్యవసాయ, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తావన వచ్చినా అమలు కాలేదు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి స్వస్థలం NGKL జిల్లా కావడంతో, 30ఏళ్ల కల నెరవేరుతుందన్న ఆశ ప్రజల్లో వ్యక్తమౌతోంది.

error: Content is protected !!