News March 13, 2025
పిఠాపురం: ఆవిర్భావ సభకు వచ్చే జనసైనికులకు పార్టీ హితవు

జనసేన ఆవిర్భావ సభకు లక్షల్లో క్యాడర్ రానున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారికి పార్టీ కొన్ని సూచనలు చేసింది. ‘టోల్ ప్లాజా వద్ద గొడవలు పెట్టుకోవద్దు. ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు. క్రమశిక్షణతో ఉండాలి. మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. సభాస్థలిలో ప్రశాంతంగా ఉండాలి. ప్రచార పత్రంలో పార్టీ అధ్యక్షుని ఫోటో, పార్టీ ఆమోదించిన వారి ఫోటోలే ఉండాలి’ అంటూ కార్యకర్తలకు మార్గదర్శకాలు జారీ చేశారు.
Similar News
News April 19, 2026
తిరుమల శ్రీవారికి ‘రూ.కోటి’ విరాళం ఇస్తే.!

☞దాతతోపాటు నలుగురు ఏడాదిలో 3 రోజులు సుప్రభాత సేవ, 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజులు సుపథం ప్రవేశ దర్శనం పొందవచ్చు ☞అంతేకాకుండా 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, దుప్పట-1, రవికె-1, మహాప్రసాదం ప్యాకెట్లు-10, ఒకసారి వేద ఆశీర్వచనం పొందవచ్చు ☞వీటితోపాటు రూ.3 వేల విలువ చేసే వసతి గదుల సదుపాయం 3 రోజులు కల్పిస్తారు ☞జీవిత కాలంలో ఒకసారి దాత 5గ్రా. శ్రీవారి బంగారు డాలర్, 50 గ్రా.సిల్వర్ డాలర్ పొందవచ్చు.
News April 19, 2026
కామారెడ్డి జిల్లా గరం.. గరం

కామారెడ్డి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మద్నూరు మండలం మేనూరులో 44.2°Cల అత్యధిక ఉష్ణోగ్రత, అత్యల్పంగా రాజంపేట మండలం ఆర్గొండలో 41°C రికార్డు అయ్యింది. జిల్లాలోని 32 వెదర్ స్టేషన్లలో అన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు అధికారులు వెల్లడించారు. రోజురోజుకు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News April 19, 2026
నల్గొండ: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

రైలు కింద పడి ఓ గుర్తుతెలియని మహిళ(55) ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం రాత్రి చిట్యాల – శ్రీరాంపురం మధ్య గోపలాయపల్లి వద్ద చోటుచేసుకుంది. సికింద్రాబాద్ – హౌరా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కింద పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్టేషన్ మాస్టర్ అభినవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లగొండ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు 87126 58595 నంబర్కు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.


