News March 13, 2025
పిఠాపురం: ఆవిర్భావ సభకు వచ్చే జనసైనికులకు పార్టీ హితవు

జనసేన ఆవిర్భావ సభకు లక్షల్లో క్యాడర్ రానున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారికి పార్టీ కొన్ని సూచనలు చేసింది. ‘టోల్ ప్లాజా వద్ద గొడవలు పెట్టుకోవద్దు. ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు. క్రమశిక్షణతో ఉండాలి. మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. సభాస్థలిలో ప్రశాంతంగా ఉండాలి. ప్రచార పత్రంలో పార్టీ అధ్యక్షుని ఫోటో, పార్టీ ఆమోదించిన వారి ఫోటోలే ఉండాలి’ అంటూ కార్యకర్తలకు మార్గదర్శకాలు జారీ చేశారు.
Similar News
News September 19, 2025
జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. నిమ్స్లో మీడియా సెంటర్

నిమ్స్ ఆస్పత్రిలో జర్నలిస్టులు, అధికారులకు వాగ్వాదాలు జరిగిన నేపథ్యంలో మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సమాచారం కోసం వచ్చే మీడియా ప్రతినిధుల సౌకర్యార్థం మీడియా సెల్ ఏర్పాటు చేశామని ఆస్పత్రి మీడియా ఇన్ఛార్జి సత్యాగౌడ్ తెలిపారు. అక్కడే పార్కింగ్ సదుపాయమూ కల్పించామన్నారు. జర్నలిస్టులకు సిబ్బంది ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్న అంశాలపై యాజమాన్యం దృష్టి సారించిందన్నారు.
News September 19, 2025
రోజూ వాల్నట్స్ తింటే ఇన్ని ప్రయోజనాలా?

* మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి
* బరువును నియంత్రిస్తాయి
* గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి
* సంతాన సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతాయి
* ఎముకలను బలోపేతం చేస్తాయి
* క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి
* షుగర్ రాకుండా కాపాడుతాయని వైద్యులు చెబుతున్నారు.
Share It
News September 19, 2025
కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే లేరు: కేటీఆర్

TG: వంద రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ BRS కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి గానీ, ముస్లిం ఎమ్మెల్యే గానీ, ముస్లిం ఎమ్మెల్సీ గానీ లేరని వ్యాఖ్యానించారు.