News March 13, 2025
జగిత్యాల: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

జగిత్యాల జిలాల్లో భర్తను భార్య హత్య చేసింది. ఈ ఘటన మేడిపల్లి మండలం కొండాపూర్లో జరిగింది. పోలీసుల వివరాలు.. మద్యానికి బానిసైన రాజన్న(55) తాగి వచ్చి భార్య కళావతిని వేధించేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తాగొచ్చి గొడవ పడ్డాడు. కోపంతో కళావతి రాజన్నను గొడ్డలితో నరికి చంపింది. మృతుడి చెల్లెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.
Similar News
News November 7, 2025
NZB: ఈ నెల 8 నుంచి రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు

తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి 9 వరకు సీనియర్ పురుషులు, మహిళల రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలను HYD సుల్తాన్ సాయి ప్లే గ్రౌండ్లో ఓపెన్ క్యాటగిరిలో నిర్వహిస్తామని NZB రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్తో హాజరుకావాలన్నారు. మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్ 9550358444కు సంప్రదించాలన్నారు.
News November 7, 2025
రథాల రామారెడ్డికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా!

కామారెడ్డి(D)లోని రామారెడ్డిని పూర్వం దోమకొండ సంస్థానాధీశుడు రామిరెడ్డి పాలించడం, ఆ ఊరిలో రామాలయం పేరు మీదుగా రామారెడ్డి అనే పేరు వచ్చింది. సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఒక రథం, రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఒక రథం, ఇసన్నపల్లి-రామారెడ్డి కాలభైరవ స్వామి ఆలయంలో ఒక రథం ఉన్నాయి. ఇలా రథాలు ఉన్నందున పూర్వ కాలం నుంచే రథాల రామారెడ్డిగా పూర్వీకులు పిలుస్తున్నారు.
News November 7, 2025
శ్రీకాకుళం: జిల్లా వ్యవసాయ అధికారిగా మనోహర్

జిల్లా వ్యవసాయ అధికారిగా మనోహర్ ప్రసాద్ గురువారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. జిల్లా వ్యవసాయ కార్యాలయంలో జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పూజారి సత్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు ఆయనను కలిసి అభినందించారు. వ్యవసాయ శాఖ సేవలు రైతులకు అందించడం లక్ష్యంగా పని చేస్తానని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు రైతులకు చేర్చడం, లాభసాటి వ్యవసాయ పద్ధతులు అమలు లక్ష్యంగా వివరించారు.


