News March 13, 2025

సెకండియర్ పరీక్షకు 299 మంది గైర్హాజరు: కలెక్టర్ తేజస్

image

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలలో భాగంగా బుధవారం ఇంటర్ మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 7,616 మంది విద్యార్థులకు గాను 7,317 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 299 మంది గైర్హాహరైనట్లు వెల్లడించారు. 

Similar News

News July 4, 2025

ట్యాంక్‌బండ్‌లో దూకిన మహిళ.. కాపాడిన యువకుడు

image

హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. స్థానికుల వివరాలు.. రామంతాపూర్‌కు చెందిన మహిళ శుక్రవారం ట్యాంక్‌బండ్‌ మీదకు వచ్చింది. ఒక్కసారిగా నీటిలో దూకేసింది. ఇది గమనించిక ట్యాంక్‌బండ్ శివ కుమారుడు హుస్సేన్‌సాగర్‌లోకి దిగారు. నీటిలో మునుగుతున్న ఆమెను బ్లూ కోట్ పోలీసుల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడాడు. మహిళ సూసైడ్ అటెంప్ట్‌కు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

News July 4, 2025

సెప్టెంబర్‌లో స్కిల్ పోర్టల్ ప్రారంభం: మంత్రి లోకేశ్

image

AP: స్కిల్ పోర్టల్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించారు. ‘ఉద్యోగ, ఉపాధి కల్పనకు మిషన్ మోడ్ విధానంలో స్కిల్ పోర్టల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తాం. 90 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఆటోమేటిక్‌గా రెజ్యూమ్ రెడీ అవుతుంది’ అని Xలో పోస్ట్ చేశారు.

News July 4, 2025

ఏలూరు: పోగొట్టుకున్న నగదు అందజేసిన ఎస్పీ

image

సైబర్ నేరాలను త్వరితగతిన చేధించి బాధితులకు వారు పోగొట్టుకున్న సొమ్మును తిరిగి సైబర్ పోలీసులు అందిస్తున్నారని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. ఏలూరు జిల్లా సైబర్ పోలీసులు నమోదు చేసిన రెండు కేసులలో బాధితులకు రూ.2 లక్షల రూపాయల నగదును ఎస్పీ చేతుల మీదుగా బాధితులకు అందించారు. సైబర్ సీఐ దాసు, కానిస్టేబుల్ శివలను ఎస్పీ అభినందించారు.