News March 13, 2025
వనపర్తి: కీచక ఉపాధ్యాయులపై సస్పెన్షన్

విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ డీఇవో అబ్దుల్ ఘని ఉత్తర్వులుజారీ చేశారు. పాన్గల్ జడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న చిన్న నాగన్న, రఘురాం ఈనెల 5న స్కూల్లో నిర్వహించిన వార్షికోత్సవంలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. డీఇవో విచారణ చేసి టీచర్లను సస్పెండ్ చేశారు. హెచ్ఎం విజయ్, టీచర్ కిరణ్కు షోకాస్ నోటీస్ జారీ చేశారు.
Similar News
News April 18, 2026
పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.1,42,800గా ఉంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.5000 ఎగసి రూ.2,80,000కి చేరింది.
News April 18, 2026
చరిత్రకు సజీవ సాక్ష్యం మెదక్ ఖిల్లా

మెదక్లో చారిత్రక కీర్తిని చాటుతూ నిలిచిన మెదక్ ఖిల్లా పర్యాటకులను ఆకర్షిస్తోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కోట కాకతీయుల కాలంలో నిర్మాణం చెంది, అనంతరం కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు అభివృద్ధి చేశారు. బలమైన గోడలు, అద్భుత నిర్మాణ శైలి ఖిల్లా వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పైభాగం నుంచి కనిపించే ప్రకృతి అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రాంత చరిత్రను గుర్తు చేస్తూ వారసత్వ చిహ్నంగా ఇది నిలిచింది.
News April 18, 2026
చారిత్రకు ఆనవాళ్లు జోగిపేట కోట !

సంగారెడ్డి(D) జోగిపేట కోట నిజాం కాలం వైభవానికి సాక్ష్యంగా నిలుస్తోంది. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతం నిజాం పాలనలోకి వచ్చాక పరిపాలన, రక్షణ అవసరాల కోసం ఈ కోటను ఉపయోగించారు. ఇక్కడి ఇండో-ఇస్లామిక్ శైలి కట్టడాలు, గడిలు నాటి గొప్పతనాన్ని చాటుతున్నాయి. చారిత్రక ఆంధ్ర మహాసభలకు వేదికైన ఈ కోట, తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనూ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ నిర్మించిన క్లాక్ టవర్కు సుమారు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది.


