News March 13, 2025

ప్రకాశం: రూ.40లక్షల ఉద్యోగం.. అయినా సూసైడ్

image

గిద్దలూరులో హైటెన్షన్ కరెంట్ వైర్‌ పట్టుకున్న విద్యార్థి చనిపోయాడు. కంభం(M) రావిపాడుకు చెందిన అమరనాథ్(22) బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. రూ.40 లక్షల జీతంతో జాబ్‌కు సెలెక్టయ్యాడు. HYDలో అన్నను చూసొస్తానని చెప్పి వెళ్లాడు. అన్నను కలవకుండానే ఫ్రెండ్‌తో కలిసి నిన్న గిద్దలూరు వచ్చాడు. ఫ్రెండ్‌ని వాటర్ బాటిల్‌కి పంపి అతను గూడ్స్ రైలెక్కి వైర్లు పట్టుకున్నాడు. కర్నూలులో చికిత్స పొందుతూ చనిపోయాడు.

Similar News

News January 17, 2026

మార్కాపురం జేసీ బాధ్యతలు స్వీకరణ

image

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పులి శ్రీనివాసులు శనివారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు చేరుకున్న శ్రీనివాసులుకు అధికారుల పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సిటీ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.

News January 17, 2026

నేడు దర్శి రానున్న మంత్రులు

image

దర్శిలో పలు అభివృద్ధి పనులకు శనివారం భూమి పూజలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. వీరితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు, దర్శి ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరుకానున్నారు.

News January 17, 2026

నేడు దర్శి రానున్న మంత్రులు

image

దర్శిలో పలు అభివృద్ధి పనులకు శనివారం భూమి పూజలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. వీరితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు, దర్శి ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరుకానున్నారు.