News March 13, 2025

మళ్లీ జగన్‌ను CMను చేసుకుందాం: మేకపాటి

image

వైసీపీ అధినేత జగన్.. CMగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలకన్నా అదనపు సంక్షేమ పథకాలు ఇచ్చారని ఆ పార్టీ నేత మేకపాటి రాజగోపాల్ రెడ్డి కొనియాడారు. 2014-19 వరకు ఐదేళ్ల చంద్రబాబు పాలనను అనుభవించి కూడా మళ్లీ ఆయనకే పట్టం కట్టి ప్రజలు మోసపోయారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి నాయకులు ఇచ్చిన హామీలను ప్రశ్నించాలన్న ఆయన మరోసారి వచ్చే ఎన్నికలల్లో జగన్‌ను CMను చేసుకుందామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

Similar News

News March 13, 2025

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

image

2025 మార్చి ఒకటి నుంచి నెల్లూరు జిల్లాలో 79 కేంద్రాలలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రధాన పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్మీడియట్ బోర్డు నెల్లూరు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి డాక్టర్ ఏ శ్రీనివాసులు తెలిపారు. గురువారం నాటి జనరల్ విభాగంలో 27,753 మంది విద్యార్థులకు గాను 792 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, ఒకేషనల్ విభాగంలో 730 మందికి గాను 104 మంది గైర్హాజరయ్యారన్నారు.

News March 13, 2025

పోరాటాలతో ప్రభుత్వం మెడలు వంచుతాం: కాకాణి

image

పేద విద్యార్థులకు చదువును దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి కాకాణి ఆరోపించారు. ‘యువత పోరు’లో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేసినట్లు ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు ప్రభుత్వం రూ.7,100 కోట్ల బకాయిలు ఉండగా కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. పోరాటాలతో ప్రభుత్వం మెడలు వంచుతాం అని కాకాణి హెచ్చరించారు.

News March 13, 2025

15న కొండబిట్రగుంటకు రానున్న సింగర్ సత్యయామిని

image

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నవిషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 15 గ్రాండ్‌గా మ్యూజికల్ నైట్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్ సత్యయామిని సందడి చేయనున్నారు. ఆవిడతోపాటూ జబర్దస్త్ నటీనటులు కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

error: Content is protected !!