News March 13, 2025

వికారాబాద్: విషాదం.. యువకుడి మృతి

image

వికారాబాద్ జిల్లా దోమ మండలం మైలారం వద్ద జరిగిన <<15741649>>రోడ్డు ప్రమాదంలో<<>> మోత్కూర్ గ్రామానికి చెందిన సాయికుమార్, ధన్‌రాజ్‌ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వారిని స్థానికులు పరిగి ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ధన్‌రాజ్ ఈరోజు తెల్లవారుజామున మరణించాడని, సాయి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Similar News

News March 14, 2025

SPMVV : ఫలితాలు విడుదల

image

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏడాది జనవరిలో (M.B.A) మీడియా మేనేజ్మెంట్ మొదటి సెమిస్టర్, ఫిబ్రవరి నెలలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు మహిళ యూనివర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News March 14, 2025

MLG: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

image

ములుగుల్లో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI

News March 14, 2025

భూముల వివాదాల పరిష్కారానికి కృషి చేయాలి : కలెక్టర్

image

ప్రస్తుతం జరుగుతున్న రీసర్వేలో అటవీ అధికారులు భాగస్వాములై ఆయా భూముల వివాదాల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా కలెక్టర్ ఆనంద్ కోరారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో అటవీ, వన్యప్రాణుల రక్షణపై సమీక్షా సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత సమావేశ ఉద్దేశాలను జిల్లా అటవీ శాఖాధికారి మహబూబ్ భాషా వివరించారు.

error: Content is protected !!