News March 13, 2025
సత్తెనపల్లి: అల్లుడి చేతిలో.. మామ హతం

సత్తెనపల్లి మండలం దీపాలదిన్నెపాలెంలో అల్లుడు చేతిలో మామ హతమయ్యాడు. వివరాల్లోకెళ్తే.. దీపాలదిన్నెపాలెంకు చెందిన గంగయ్య(గంగారమ్) తరచూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో అల్లుడ్ని మందలించేందుకు వచ్చిన మామ, బావమరిదిపై గంగయ్య గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన బత్తుల గంగయ్య(55) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 16, 2025
ఏఆర్ రెహమాన్ హెల్త్ అప్డేట్

మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు బాగానే ఉన్నారని ఆయన తనయుడు అమీన్ తెలిపారు. ‘డీహైడ్రేషన్ కారణంగా నాన్నగారు కొంచెం బలహీనంగా అనిపించారు. అందుకే ఆస్పత్రిలో రొటీన్ టెస్టులు చేయించాం. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. తాను వైద్యులతో మాట్లాడానని, రెహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారని TN సీఎం స్టాలిన్ వెల్లడించారు. రెహమాన్ను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
News March 16, 2025
సీఎం రేవంత్ క్లాస్.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు అటెండెన్స్?

TG: నిన్న అసెంబ్లీలో CM రేవంత్ ప్రసంగం సమయంలో లంచ్ టైమ్ దాటిపోతున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా కదల్లేదు. రోజుకు 3సార్లు MLAల హాజరు తీసుకోవాలని ఆయన చేసిన ఆదేశాలే దీనికి కారణమని తెలుస్తోంది. 3రోజుల క్రితం CLP మీటింగ్లో CM మాట్లాడుతున్న సమయంలో ఓ MLA నిర్లక్ష్యంగా బయటికి వెళ్లడం, సభలో BRS నేతలకు తమ సభ్యులు సరైన కౌంటర్ ఇవ్వడం లేదనే రేవంత్ హాజరు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
News March 16, 2025
పార్వతీపురం: ‘పొట్టి శ్రీరాములు జీవితం చిరస్మరణీయం’

అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం చిరస్మరణీయమని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎ. శ్యాం ప్రసాద్ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలలు వేశారు.